టీమిండియా తప్పక ఓడిపోతుంది అని అందరూ అనుకుంటున్న సమయంలో కూడా పట్టువిడవకుండా వీరోచిత పోరాటం చేసిన భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణించి భారత జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ఈ క్రమంలోనే భారత ఆటగాళ్లు పోరాడిన తీరు పై అటు ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది అనే విషయం తెలిసిందే. ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు కూడా ప్రస్తుతం టీమిండియా పోరాటానికి ఫిదా అయిపోయాము అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ టీమిండియా జట్టును హెచ్చరించాడు.
ఇటీవలే గబ్బా స్టేడియంలో విజయం సాధించిన టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది అనే సంతోషంలో ఉందని.. కానీ అసలైన జట్టు మరికొన్ని రోజుల్లో భారత జట్టుతో తలపడనుంది. ఆ జట్టు మిమ్మల్ని మీ స్వస్థలం లోనే జోడించవచ్చు.. జాగ్రత్తగా ఉండండి అంటూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ హెచ్చరించాడు. అయితే మరికొన్ని రోజుల్లో స్వదేశంలో భారతజట్టు ఇంగ్లాండు జట్టుతో వరుసగా సిరీస్ లు ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.