ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షాలకు పదవీ కాలం పొడిగింపుపై సుప్రీం కోర్టులో కేసు ధాఖలైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ వచ్చే నెల 16కు వాయిదా పడింది. ఈ కేసు విచారణ బుధవారం సుప్రీం బెంచ్ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు విచారణ చేస్తున్న జడ్జి జస్టిస్ ఇందు మల్హోత్రా ప్రకటించారు. దీంతో ఈ కేసును మరోక బంచ్ వారు విచారణ జరిపించాలని సుప్రీం బెంచో జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు అన్నారు. గతేడాది డిసెంబరులో ఈ కేసు విచారణను జనవరికి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు దానిని కూడా వచ్చెనెల 16కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

తాజాగా బెంచ్ నుంచి ఓకరు తప్పుకోవడంతో దీని విచారణను వేరే బెంచ్ చేయవలసిందిగా రావు గారు కోరారు. ఇదిలా ఉంటే, బీసీసీఐ రాజ్యాంగ సవరణకు అనుమతించాలంటూ బోర్డు ట్రెజరర్‌ అరుణ్‌ దుమాల్‌ గతేడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. స్టేట్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌, బీసీసీఐలో కలిపి వరుసగా ఆరేళ్లు పదవిలో ఉన్న ఈ ఇద్దరూ లోధా కమిటీ సిఫారసుల ప్రకారం కచ్చితంగా మూడేళ్ల విరామం(కూలింగ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ పీరియడ్‌‌‌‌) తీసుకోవాల్సి ఉంటుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా సౌరవ్, జే ఆ పదవుల్లోనే ఉన్నారు. దీంతో రాజ్యాంగ సవరణలు కోరుతూ సుప్రీం కోర్టును బోర్డు ఆశ్రయించింది. గత డిసెంబర్‌లో పిటిషన్ విచారణకు రాగా... జనవరి మూడో వారానికి వాయిదా పడింది. అయితే తాజాగా మరోసారి ధర్మాసనం వాయిదా వేసింది.    

కాగా.. బీసీసీఐలో అవకతవకలు జరిగాయంటూ ... జార్ఖండ్ క్రికెట్ అసోషియేషన్ ట్రెజరర్ నరేశ్ మకానీ కూడా పిటిషన్ దాఖలు చేశారు. బీసీసీఐ రాజ్యాంగానికి విరుద్ధంగా పదవులు అనుభవిస్తున్నారంటూ నరేశ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మరి దీనిపై ధర్మశాసనం ఏ విధమైన తీర్పును ఇస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: