గత ఏడాది చివర్లో ఐపీఎల్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ లో రోహిత శర్మ  సారధ్యంలో ముందుకు కదిలిన ముంబై ఇండియన్స్ జట్టు మొదటి మ్యాచ్ నుంచి కూడా సత్తా చాటి ఎప్పుడూ అగ్రస్థానంలో నిలిచి మరోసారి దిగ్గజ జట్టు అనే పేరు నిలబెట్టుకొని టైటిల్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే.  అయితే ఎన్నో ఏళ్ల నుంచి టైటిల్ కోసం తహతహలాడుతున్న విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాత్రం మొదట్లో కాస్తమెరుగైన ప్రదర్శన చేసింది అనిపించినప్పటికీ చివరికి అతి కష్టం మీద ప్లేఆఫ్ కి అర్హత సాధించి ఇక ఒక్క అడుగు దూరంలోనే మళ్ళీ ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది.


 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ని కేవలం టెస్ట్ క్రికెట్ కి మాత్రమే కెప్టెన్గా పరిమితం చేసి వన్డే, టి20 లకు రోహిత్ శర్మ ను టీమిండియా కెప్టెన్గా నియమించాలని కొత్త డిమాండ్ తెరమీదికి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రోహిత్ శర్మ తన కెప్టెన్సీ ఎంతో మెరుగ్గా ఉంది అన్న విషయాన్ని ఐపీఎల్లో ఎన్నోసార్లు నిరూపించుకున్నాడని..  కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఇప్పటికీ కూడా నిరూపించుకో లేకపోయాడు అంటూ ఎంతో మంది విమర్శలు కూడా చేశారు.  అయితే అలా కెప్టెన్సీమార్పు చేయడం ద్వారా ఆటగాళ్ల మధ్య విభేదాలు ఏర్పడతాయని మాజీ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తే..  కెప్టెన్సీ మార్పు జరిగే అవకాశం లేదు అని బిసిసిఐ స్పష్టం చేసింది.



 ఇక ఇటీవలే మరోసారి కెప్టెన్సీ మార్పుకు సంబంధించిన చర్చ తెరమీదికి వచ్చింది. విరాట్ కోహ్లీ గైర్హాజరై తో భారత జట్టు ఎలాగా రాణిస్తుందో అని అనుమాన పడినప్పటికీ.. తాత్కాలిక కెప్టెన్  అజింక్య రహానే కెప్టెన్సీలోని భారత జట్టు అద్భుతంగా రాణించింది. ఇక అజింక్య రహానే కెప్టెన్సీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు భారత క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గబ్బా స్టేడియం లో విజయం సాధించింది. ఈ క్రమంలోనే కెప్టెన్సీ మార్పు అంశం  మళ్లీ తెరమీదకు రావడంతో స్పందించిన బిసిసిఐ ఇప్పట్లో విరాట్ కోహ్లీ ని  కెప్టెన్సీ బాధ్యతలను తొలగించే ఆలోచనలు లేవు అంటూ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: