దీంతో తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించడం లేదని,కరోనా వ్యాప్తి నేపథ్యంలో క్రికెటర్లు, ప్రేక్షకుల భద్రత దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదిలా ఉండగా క్రికెట్ అభిమానులకు అసలైన క్రికెట్ మజా రుచి చూపించే ఐపీఎల్ కు అంతా సిద్ధమవుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్కు ముందే ఆటగాళ్ల వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్టు తెలుస్తుంది. రాబోయే సీజన్కు సంబంధించిన ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 18న జరిగే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి శుక్రవారం పీటీఐకి తెలిపారు.
అయితే ఈ ఏడాది ఐపీఎల్ భారత్లో జరుగుతుందా లేదా అనే విషయంపై బీసీసీఐ ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ, రాబోయే సీజన్ను స్వదేశంలో నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో భారత్ సిరీస్ సజావుగా జరిగితే స్వదేశంలోనే ఐపీఎల్ నిర్వహించడానికి మార్గం సుగమం అవుతుంది. మరి క్రికెట్ అభిమానులు స్టేడియంలో మ్యాచ్ చూసి ఆస్వాదించాలని కోరుకుంటున్న తరుణంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.