సురేష్ రైనా ఎంతటి ప్రతిభ ఉన్న ఆటగాడో అందరికీ తెలిసిందే.. టీమిండియా జట్టులో మిడిలార్డర్ లో బలమైన ఆటగాడిగా జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. మైదానంలో మెరుపులా కదులుతూ చురుకైన ఫీల్డింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ను బెంబేలెత్తిస్తాడు. ఒక్క బ్యాటింగ్, ఫీల్డింగ్ లోనే కాక బౌలింగ్ లో కూడా తనదైన ముద్ర వేశాడు. అయితే గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి  తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ లో కొనసాగుతూనే ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఉన్న సురేష్ రైనా జట్టులో వైస్ కెప్టెన్ గా ఉంటూ కీలకపాత్ర పోషిస్తుంటాడు. చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన కీలక మ్యాచ్ లలో రైనా తనదైన ఆటతో ఆకట్టుకున్నాడు.

 యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌ నుంచి రైనా వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న విషయం తెలిసిందే. జట్టుతో దుబాయ్‌కి వెళ్లిన రైనా.. మళ్ళీ తిరిగి వచేసాడు. అయితే ఇది చెన్నై బ్యాటింగ్‌ ఆర్డర్‌పై పెను ప్రభావం చూపింది. జట్టు కూర్పు ఏమాత్రం కుదరలేదు. దీంతో సీఎస్‌కే లీగ్‌ చరిత్రలోనే అత్యంత నిరాశజనకమైన ప్రదర్శనతో నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో సురేశ్‌ రైనాకు చెన్నై ఫ్రాంచైజీ వదిలి పెట్టడం ఖాయమనే వార్తలు కూడా బలంగానే వినిపించాయి.

అయితే మళ్లీ ఈ సీజన్ లో రైనా ఆడనున్నట్టు సి ఎస్ కే యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉండగా సురేశ్ రైనా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో వచ్చే సీజన్‌తో కలుపుకొని రూ.100 కోట్ల వేతనం తీసుకున్న ఆటగాడిగా సురేశ్ రైనా రికార్డు సృష్టించనున్నాడు. అయితే ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రూ.150 కోట్లు తో అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మరూ.131 కోట్లు తో , విరాట్ కోహ్లీ రూ.126 కోట్లు తో రైనా కంటే ముందున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: