యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్ నుంచి రైనా వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న విషయం తెలిసిందే. జట్టుతో దుబాయ్కి వెళ్లిన రైనా.. మళ్ళీ తిరిగి వచేసాడు. అయితే ఇది చెన్నై బ్యాటింగ్ ఆర్డర్పై పెను ప్రభావం చూపింది. జట్టు కూర్పు ఏమాత్రం కుదరలేదు. దీంతో సీఎస్కే లీగ్ చరిత్రలోనే అత్యంత నిరాశజనకమైన ప్రదర్శనతో నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో సురేశ్ రైనాకు చెన్నై ఫ్రాంచైజీ వదిలి పెట్టడం ఖాయమనే వార్తలు కూడా బలంగానే వినిపించాయి.
అయితే మళ్లీ ఈ సీజన్ లో రైనా ఆడనున్నట్టు సి ఎస్ కే యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉండగా సురేశ్ రైనా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో వచ్చే సీజన్తో కలుపుకొని రూ.100 కోట్ల వేతనం తీసుకున్న ఆటగాడిగా సురేశ్ రైనా రికార్డు సృష్టించనున్నాడు. అయితే ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రూ.150 కోట్లు తో అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మరూ.131 కోట్లు తో , విరాట్ కోహ్లీ రూ.126 కోట్లు తో రైనా కంటే ముందున్నారు.