ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ అద్బుత విజయం సాధించడంలో రహనే కెప్టెన్సీ కీలక పాత్ర వహించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జట్టు క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయాన తన వ్యూహాత్మక నిర్ణయాలతో జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. దీంతో రహనే కెప్టెన్సీ పై ప్రముఖులు ప్రశంశల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా ఆసీస్ పర్యటన ముగించుకుని స్వదేశం చేరుకున్న టీమిండియా మళ్ళీ మరొక ఆసక్తికర పోరుకు సిద్దమౌతుంది.

అయితే ఈ సారి స్వదేశం లో జరుగుతుడడం టీమిండియా కు సానుకూలాంశం.. భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య జరిగే ఈ ఆసక్తికర పోరు మరో వారం రోజుల్లో చెన్నై వేదికగా టెస్ట్ సిరీస్ ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఇప్పటికే చెన్నై చేరుకున్నాయి. కరోనా కారణంగా భారత  ఆటగాళ్లు స్థానిక హోటల్‌లో ఆరు రోజుల పాటు బయో బబుల్ పాటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌కు ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులను తీసుకొచ్చేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వడంతో కొంతమంది టీమిండియా క్రికెటర్లు తమ భార్య, పిల్లలతో చెన్నై చేరుకున్నారు.. ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా క్వారంటైన్‌లోనే ఉండ్సాలి రావడంతో ఆటగాళ్లు ఫ్యామిలీతోనే సరదాగా గడుపుతున్నారు.

 ఈ నేపథ్యంలో అజింక్య రహనే కూతురితో సరదాగా డ్యాన్స్ వేసిన వీడియోను రహనే సతీమణి రాధిక సోషల్ మీడియా లో పోస్ట్ చెయ్యడంతో ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది.  తొలి రోజు సరదాగా  గడిచిందంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్‌ చేసింది.ఈ వీడియో చూసిన అభిమానులు రహనే కూతురి డాన్స్ కు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా వచ్చే నెల 5 తేదీ నుండి చెన్నై వేదికగా టీమిండియా- ఇంగ్లాండ్ జట్ల మద్య మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది.అయితే ఇరు జట్లు కూడా గెలుపు పై ధీమాగా ఉండడంతో ఈ రెండు జట్ల మద్య పోరు ఆసక్తికరంగా మారనుంది.   .  

మరింత సమాచారం తెలుసుకోండి: