అయితే ఈ సారి స్వదేశం లో జరుగుతుడడం టీమిండియా కు సానుకూలాంశం.. భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే ఈ ఆసక్తికర పోరు మరో వారం రోజుల్లో చెన్నై వేదికగా టెస్ట్ సిరీస్ ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఇప్పటికే చెన్నై చేరుకున్నాయి. కరోనా కారణంగా భారత ఆటగాళ్లు స్థానిక హోటల్లో ఆరు రోజుల పాటు బయో బబుల్ పాటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్కు ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులను తీసుకొచ్చేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వడంతో కొంతమంది టీమిండియా క్రికెటర్లు తమ భార్య, పిల్లలతో చెన్నై చేరుకున్నారు.. ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా క్వారంటైన్లోనే ఉండ్సాలి రావడంతో ఆటగాళ్లు ఫ్యామిలీతోనే సరదాగా గడుపుతున్నారు.
ఈ నేపథ్యంలో అజింక్య రహనే కూతురితో సరదాగా డ్యాన్స్ వేసిన వీడియోను రహనే సతీమణి రాధిక సోషల్ మీడియా లో పోస్ట్ చెయ్యడంతో ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. తొలి రోజు సరదాగా గడిచిందంటూ ఆమె ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేసింది.ఈ వీడియో చూసిన అభిమానులు రహనే కూతురి డాన్స్ కు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా వచ్చే నెల 5 తేదీ నుండి చెన్నై వేదికగా టీమిండియా- ఇంగ్లాండ్ జట్ల మద్య మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది.అయితే ఇరు జట్లు కూడా గెలుపు పై ధీమాగా ఉండడంతో ఈ రెండు జట్ల మద్య పోరు ఆసక్తికరంగా మారనుంది. .