లంకతో రెండు టెస్ట్ల సిరీ్సను సోమవారం ముగించుకొన్న ఇంగ్లండ్.. అక్కడి నుంచి నేరుగా భారత్కు చేరుకొంది. కాగా, ఆల్రౌండర్ బెన్స్టోక్స్, పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆదివారమే ఇక్కడకు చేరుకొని కరోనా నిబంధనల ప్రకారం క్వారంటైన్లో ఉన్నారు. భారత స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, రహానె మంగళవారం రాత్రి వచ్చారు. బుధవారం ఉదయం పుజార, బుమ్రా, పంత్ రాగా.. రాత్రికి విరాట్ చేరుకొన్నాడు. ఇరు జట్లు కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఏ జట్టు ఆధిక్యం ప్రదర్శిస్తుందా..అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఇక ఆస్ట్రేలియా పర్యటనలో బార్డర్ గవాస్కర్ ట్రోఫీ లో మొదటి టెస్ట్ అనంతరం జట్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి చేరాడు. ఇదిలా ఉండగా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కేరళ హైకోర్ట్ నోటీసులు పంపడం కాస్త ఆందోళన కలిగించే విషయం. కోహ్లీ ఆన్లైన్ గెమింగ్ సంస్థ కు బ్రాండ్ అంభాసిటర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కేరళలో ఆన్ లైన్ గెమింగ్ సంస్థ లను నిషేదించాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వీటిని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోహ్లీ తోపాటు మరో ఇద్దరికీ కోర్ట్ నోటీసులు ఇచ్చింది. .