ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఇక ఈ టెస్ట్ సిరీస్ కి భారత్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం టెస్ట్ సిరీస్లో భాగంగా భారత జట్టు అద్భుతంగా రాణిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు భారత్ ఇంగ్లాండ్ మధ్యమూడు టెస్ట్ మ్యాచ్ లు జరగగా ఇక మూడింటిలో రెండు విజయాలను సాధించిన భారత జట్టు ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతోంది అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. ఇకపోతే ఇటీవలే ఇంగ్లాండ్ భారత్ మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ జరిగింది. అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియం వేదికగా జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ మ్యాచ్లో భారత బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించి అతి తక్కువ పరుగులకే ఇంగ్లండ్ జట్టు ఆలవుట్ చేయడంలో విజయం సాధించింది. ఇక ఆ తర్వాత ఘన విజయాన్ని అందుకుంది. అయితే మూడవ టెస్ట్ మ్యాచ్లో ఓటమి తర్వాత ఇంగ్లాండ్ ఆటగాళ్లు అందరు కూడా అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియంలో ఉన్న పిచ్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.



 అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియంలో ఉన్న పిచ్ టెస్ట్ క్రికెట్ కి అనుకూలమైనది కాదు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆటగాళ్ల  విమర్శల పై స్పందిస్తూ ఎంతోమంది ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై స్పందించిన ఆస్ట్రేలియా స్పిన్నర్ లైయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫేస్ కి అనుకూలించే పిచ్లపై తక్కువ పరుగులకే ఆలౌట్ అయినప్పుడు ఎందుకు విమర్శించలేదు.. ఇప్పుడు స్పిన్ బౌలింగ్ కి అనుకూలిస్తే మాత్రం ఏడుస్తారు ఎందుకో  అర్థం కావడం లేదు.. ఇంగ్లాండ్ భారత్ మధ్య జరిగిన మ్యాచ్  మొత్తం చూసా.. ఎంతో అద్భుతంగా సాగింది అంటూ ఆస్ట్రేలియా స్పిన్నర్ లైయన్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: