టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్న కుర్ర క్రికెటర్లకు కోచింగ్ ఇస్తున్నారు. 2014లో ఆయనకు బాలీవుడ్ నటీమణి హాజల్ కీచ్ తో స్నేహం ఏర్పడింది. స్నేహం కాస్తా  ప్రేమకు దారి తీసింది. దీంతో వాళ్ళిద్దరూ  2016 నవంబర్ 30వ తేదీన పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ ముంబైలోని వర్లి లో 16 వేల స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో విలాసవంతమైన అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు. అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న ఈ అపార్ట్మెంట్ ని 2013వ సంవత్సరంలో 64 కోట్ల రూపాయలతో యువరాజ్ సింగ్ కొనుగోలు చేశారు.

అయితే ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను తన భార్య సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానులను ఫిదా చేసేవారు. అలాగే తన భర్త తో దిగిన ఫోటోలను వీడియోలను కూడా షేర్ చేసి అలరించేవారు. కానీ ఆమె సోషల్ మీడియా నుంచి దూరం కావాలంటే ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో యువరాజ్ సింగ్ అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల పాటు తాను ఇంటర్నెట్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని.. మళ్లీ తాను సోషల్ మీడియాలో యాక్టీవ్ అవుతానని అంతవరకు ఎవరు బాధపడకండి అని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు.

బంధుమిత్రులతో సహా అభిమానులు ఎవరు కూడా తనికి మెసేజ్ పంపించ వద్దు అని ఆమె కోరారు. పూర్తిగా ఒకరిపై ఆధారపడి జీవించడం అలవాటైన మనందరం సోషల్ మీడియా నుంచి దూరమయ్యి ఒంటరిగా ఉంటూ ఎలా బతకాలో నేర్చుకోవాలని ఆమె అన్నారు. అందుకోసం ఇంటర్నెట్ నుంచి అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవాలని ఆమె సూచించారు. అయితే గత కొద్దిరోజులుగా యువరాజ్ సింగ్ భార్య గర్భవతి అయ్యారని అనేక వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: