అయితే ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను తన భార్య సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానులను ఫిదా చేసేవారు. అలాగే తన భర్త తో దిగిన ఫోటోలను వీడియోలను కూడా షేర్ చేసి అలరించేవారు. కానీ ఆమె సోషల్ మీడియా నుంచి దూరం కావాలంటే ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో యువరాజ్ సింగ్ అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల పాటు తాను ఇంటర్నెట్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని.. మళ్లీ తాను సోషల్ మీడియాలో యాక్టీవ్ అవుతానని అంతవరకు ఎవరు బాధపడకండి అని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు.
బంధుమిత్రులతో సహా అభిమానులు ఎవరు కూడా తనికి మెసేజ్ పంపించ వద్దు అని ఆమె కోరారు. పూర్తిగా ఒకరిపై ఆధారపడి జీవించడం అలవాటైన మనందరం సోషల్ మీడియా నుంచి దూరమయ్యి ఒంటరిగా ఉంటూ ఎలా బతకాలో నేర్చుకోవాలని ఆమె అన్నారు. అందుకోసం ఇంటర్నెట్ నుంచి అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవాలని ఆమె సూచించారు. అయితే గత కొద్దిరోజులుగా యువరాజ్ సింగ్ భార్య గర్భవతి అయ్యారని అనేక వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకున్నారు.