అంతేగాక టెస్టులో అత్యంత తక్కువ ఇన్నింగ్స్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన మొదటి ఆసియా ఓపెనర్గా.. టీమిండియా నుంచి రెండో ఆటగాడిగా నిలిచాడు. మొదటి టీమిండియా ఆటగాడిగా వినోద్ కాంబ్లికి 14 ఇన్నింగ్స్లలో ఈ ఘనత వహించగా.. రోహిత్ వెయ్యి పరుగులు పూర్తి చేయడానికి 17 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. ఆ తర్వాతి స్థానంలో టెస్ట్ స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారా(18 ఇన్నింగ్స్లు), మయాంక్ అగర్వాల్( 19 ఇన్నింగ్స్లు) ఉన్నారు.
ఇక ఈ జాబితాలో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 948 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా ఆటగాడు డీన్ ఎల్గర్ 848 పరుగులతో మూడో స్థానంలో నిలిచడు. ఇక ఇంగ్లండ్ ఆటగాడు డొమినిక్ సిబ్లి 841, మయాంక్ అగర్వాల్ 810 ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఇక అహ్మదాబాద్లోని మోతేరా స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ప్లేయర్లు రిషబ్ పంత్,వాషింగ్టన్ సుందర్ లు చెలరేగడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 94 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసింది. దాంతో ఇప్పటి వరకు భారత్ 89 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.