కాగా.. ఐపీఎల్ 2021 ఏప్రిల్ 9వ తేదీ నుంచి మే 30 వరకు జరగనుంది. ఈ టోర్నీ మొత్తం 52 రోజుల పాటు 60 మ్యాచ్లుగా జరగనుంది. చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీలో మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ స్టేడియాల్లో జరిగే మ్యాచ్లన్నీ ప్రేక్షకులు లేకుండానే జరగనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ప్రకటించింది. ప్రతి రోజూ రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతాయి. వారాంతాల్లో రెండు మ్యాచ్లు జరుగుతాయి. తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం.3.30 గంటల మొదలైతే.. సాయంత్రం మ్యాచ్ యథావిధిగా 7:30 గంటలకు మొదలవుతుంది.
ఇదిలా ఉంటే గతేడాది ఐపీఎల్ భారత్లో నిర్వహించేందుకు వీలు లేకపోవడంతో దుబాయ్, అబుదాబి స్టేడియాల్లో నిర్వహించారు. కానీ ఈ సారి ఇక్కడ నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ కావడమే కాకుండా దానికోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఆటగాళ్లంగా బయో బబుల్ వాతావరణంలోనే మ్యాచ్లను ఆడేలా ప్రణాళిక సిద్ధం చేసింది. టోర్నీకి ముందు ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. వాటిలో వరుసగా మూడుసార్లు నెగెటివ్ వచ్చినవారిని మాత్రమే ఆడేందుకు అనుమతించనున్నారు.
ఐపీఎల్ షెడ్యూల్: