ఇదిలా ఉంటే సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 189 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఆ జట్టు ఓపెనర్లు పృధ్వీ షా(72), శిఖర్ ధవన్(85) విజృంభించి ఆడడంతో ఢిల్లీ జట్టు భారీ లక్ష్యన్ని సులభంగా ఛేదించింది. వీరిద్దరి మెరుపు ఇన్నింగ్స్లు ఆడడంతో కేవలం 18.4 ఓవర్లలోనే ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి సునాయాసంగా విజయం సాధించింది. తొలి మ్యాచ్ విజయం సాధించి ఉత్సాహంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ రేపు రాజస్తాన్ రాయల్స్తో తలపడనుండడంతో ఈ పోటీపై భారీ అంచనాలే ఉన్నాయి.
కాగా.. ఐపీఎల్ 14వ సీజన్లో కొత్తగా గురువారం జరగబోతున్న రాజస్థాన్-ఢిల్లీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో ఈ సీజన్ ద్వారా తొలిసారి కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన ఇద్దరు టీమిండియా యువ ఆటగాళ్లు తలపడబోతుండడం అభిమానుల్లో తెగ ఆసక్తి పెంచుతోంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్, ఢిల్లీ కెప్టెన్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్ ద్వారా పోటీ పడబోతున్నారు. ఇద్దరూ టీమిండియా యువ ఆటగాళ్లు కావడం, ఈ సీజన్తోనే తొలిసారి వీరిద్దరూ కెప్టెన్లుగా ఎంపిక కావడం, అలాగే వారిపై ఉన్న అంచనాలను తగ్గట్లుగానే ఇద్దరూ తొలి మ్యాచ్లలో అద్భుతంగా రాణించడం ఈ మ్యాచ్పై అంచనాలు భారీగానే పెంచుతున్నాయి. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో సంజూ సెంచరీతో అదరగొట్టగా.. చెన్నైతో మ్యాచ్లో పంత్ చక్కటి కెప్టెన్సీ స్కిల్స్ చూపించాడు. మరి ఈ మ్యాచ్లో ఎవరు విజేతగా నిలుస్తారో..? అదిరిపోయే ఆటతో అభిమానులను అలరిస్తారో వేచి చూడాలి.