ప్రస్తుత భారత క్రికెట్లో రవిచంద్రన్ అశ్విన్ ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత జట్టులో ప్రస్తుతం కీలక బౌలర్ గా కొనసాగుతున్నాడు రవిచంద్రన్ అశ్విన్. ఇక కేవలం ఒక ఫార్మాట్ లో మాత్రమే కాకుండా అన్ని ఫార్మాట్లలో కూడా ఎంతో అద్భుతంగా రాణిస్తూ ప్రస్తుతం రవిచంద్రన్ అశ్విన్ తనకు తిరుగు లేదు అని నిరూపిస్తున్నాడు. టీమిండియా ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా కీలక సమయంలో వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు రవిచంద్రన్ అశ్విన్.


 కేవలం స్పిన్ మాయాజాలంతో మాత్రమే కాదు అవసరమైనప్పుడల్లా బ్యాట్ తో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అద్భుతంగా రాణిస్తున్నాడు అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఏకంగా సెంచరీలు కూడా చేస్తూ ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదే సమయంలో అటు బౌలింగ్ లో ఎన్నో వికెట్లు పడగొట్టి రికార్డులను కొల్లగొడుతున్నాడు రవిచంద్రన్ అశ్విన్. ఇప్పటికే వివిధ ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు అనే విషయం తెలిసిందే. ఇకపోతే రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం మరో రికార్డు పై కన్నేసినట్లు తెలుస్తోంది.



 ఐపిఎల్ లో భాగంగా రవిచంద్రన్ అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లో ఆడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్.. రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది ఈ మ్యాచ్ ఇద్దరు యువకుల మధ్య జరుగుతూ ఉండడం మరింత అంచనాలను పెంచుతుంది అయితే ఈ మ్యాచ్లో మరో వికెట్ సాధిస్తే చాలు టి20 ఫార్మాట్లో 250 వికెట్లు తీసిన రెండో బౌలర్ గా రికార్డ్స్ సృష్టిస్తాడు రవిచంద్రన్ అశ్విన్. స్పిన్నర్ అమిత్ మిశ్రా 256 వికెట్లతో టాప్ లో కొనసాగుతున్నాడు.  మరి రవిచంద్రన్ అశ్విన్ రికార్డు అందుకుంటాదా లేదా అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: