ఇంటర్నెట్ డెస్క్: భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ప్రస్తుతం ఓ పాప కూడా జన్మించింది. ప్రస్తుతం హ్యాపీ లైఫ్ గడుపుతున్నాయి. అయితే ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన ఓ విషయం సంచలనంగా మారింది. అదే వారిద్దరి ఆస్తుల విలువ. విరుష్క ఆస్తులకు సంబంధించి తాజాగా బయటకొచ్చిన సమాచారం విని సాధారణ పౌరులే కాదు అభిమానులు కూడా అవాక్కవుతున్నారు. విరుష్క దంపతుల మొత్తం ఆస్తుల విలువ దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఉంటుందటి తెలుస్తోంది. విరుష్క జంటకు విలాసవంతమైన ఇళ్లతో పాటు లగ్జరీ కార్లు, ఖరీదైన కార్యాలయాలు ఉన్నాయి.

అనుష్క శర్మ నటిగా ఎన్నో హిట్ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. ఇక విరాట్ కోహ్లీ క్రికెటర్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో బిజీబిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం అనుష్క-కోహ్లీ నివశిస్తున్న ఇంటి విస్తీర్ణం 7,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ. ఈ ఇంటి విలువ దాదాపు 34 కోట్ల రూపాయలని మార్కెట్ విలువ ప్రాకారం అంచనా. ఈ జంటకు గురుగ్రామ్ ప్రాంతంలో 80 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువ చేసే విలాసవంతమైన బంగ్లా ఉందట.


అనుష్క శర్మకు సొంతంగా నుష్ అనే ఫ్యాషన్ లేబుల్ ఉంది. ఈ బ్రాండ్ విలువ ఏకంగా 65 కోట్ల రూపాయలు. అలాగే ఓ ప్రొడక్షన్ హౌస్ కోసం అనుష్క శర్మ ఇటీవలే ఓ స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ కార్యాలయం విలువ నాలుగున్నర కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఇక ఇవి కాకుండా అనుష్క శర్మకు ముంబైలో ఖరీదైన మూడు ఫ్లాట్లు ఉన్నాయి. ఈ ఫ్లాట్ల విలువ 10 కోట్ల రూపాయల వరకు ఉంటుందట.
 
ఇక విరాట్ విషయానికొస్తే.. అతడి వద్ద 4 ఆడీ కార్లు ఉండగా అందులో ఒక్కో ఆడీ కారు విలువ 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. విరాట్ కోహ్లీ ధరించే ఒక్క గడియారం ఖరీదు 69 లక్షల రూపాయల విలువ ఉంటుందంటే ఇక అతడి ఆస్తుల గురించి ఆలోచించుకోండి. ఈ గడియారాన్ని ఏకంగా 56 వజ్రాలను అలంకరించి తయారు చేశారట. ఇవి మాత్రమే కాకుండా విరాట్, అనుష్క జంట దగ్గర ఖరీదైన ఆస్తులు ఉన్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: