అంతేకాదు టి20 ఫార్మాట్లో ఆటగాళ్లందరూ కూడా ఎంతో దూకుడుగా ఆడుతూ ఉంటారు ప్రతి బంతిని బౌండరీ ఎలా చేర్చాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ఇక టీ-20 ఫార్మెట్లో ఏ మ్యాచ్ చూసినా కూడా ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతూనే ఉంటుంది. ఆటగాళ్ల ప్రదర్శన కు 20 ఫార్మాట్ ఒక సవాల్ లాంటిదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే టీ20 ఫార్మాట్ వచ్చిన కొత్తలో బిసిసిఐ విముఖత చూపించింది. కానీ ఆ తర్వాత టి20 ఫార్మాట్ యొక్క మజా అర్థం చేసుకొని 2006లో డిసెంబర్లో తొలి టీ-20 మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆడింది భారత్. ఇలా 2006 నుంచి టి20 క్రికెట్ ఫార్మాట్ లోకి అడుగుపెట్టింది టీమిండియా
అయితే 2006 నుంచి టి20 ఫార్మాట్ భారత క్రికెటర్లు ఆడినప్పటికీ అంతకు ముందు నుంచే ఒక భారత క్రికెటర్ మాత్రం టి20 క్రికెట్ లో రికార్డుల మోత మోగించాడు టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ మంగియా 2004లో లాంకాషాయిర్ జట్టు తరఫున టి20 క్రికెట్ ఆడాడు. ఇలా టి20 ఫార్మాట్ లో క్రికెట్ ఆడిన మొట్టమొదటి భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదు 2006లో టీమ్ ఇండియా ఆడిన అంతర్జాతీయ జట్టులో కూడా దినేష్ స్థానం దక్కించుకోవడం గమనార్హం. అంతేకాకుండా దినేష్ కు అదే తొలి చివరి టి20 మ్యాచ్ కూడా కావడం గమనార్హం. బీసీసీఐ నిషేధించిన ఒక లీగ్లో ఇక దినేష్ ఆడటంతో చివరికి అతనికి భారత జట్టులో స్థానం దక్కటం కష్టంగా మారిపోయింది అతని కెరీర్ ముగిసిపోయింది.