భారత క్రీడారంగానికి ఎన్నో ఏళ్ల పాటు సేవలందించిన ఇద్దరు క్రీడాకారులు వారం రోజుల వ్యవధిలో మృతిచెందారు.  ఎన్నో ఏళ్ల పాటు అన్యోన్య భార్యాభర్తలుగా అందరికి ఆదర్శంగా నిలిచిన  మిల్కా సింగ్ ఆయన భార్య నిర్మల కౌర్ వారం రోజుల వ్యవధిలో మృతి చెందడం ఎంతో మంది అభిమానులను విషాదంలో ముంచెత్తింది.  సరిగ్గా వారం రోజుల కిందట భారత దిగ్గజ మాజీ అథ్లెట్ మిల్కాసింగ్ సతీమణి నిర్మల కౌర్ కన్నుమూసారు.  వాలీ బాల్ ఆటలో జాతీయస్థాయి గుర్తింపు సంపాదించుకున్న నిర్మల కౌర్ ఇక ఎన్నో రోజుల పాటు ఈ ఆటలో కొనసాగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. జాతీయ ఫుట్బాల్ జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించారు.



 అయితే ఇటీవలే కరోనా వైరస్ బారిన పడిన నిర్మల కౌర్ ఇక ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఇక చికిత్స పొందుతున్న సమయంలో నిర్మల  ఆరోగ్యం విషమించింది. దీంతో  కరోనా వైరస్ పోరాటంలో కన్నుమూసారు నిర్మల కౌర్. ఇక అటు వెంటనే కరోనా వైరస్ బారిన పడ్డారు భారత దిగ్గజ స్ప్రింటర్ మిల్కాసింగ్.  ఇక వెంటనే ఆయన కూడా ఆస్పత్రిలో చేరారు.  ఇక ఆసుపత్రిలో చేరిన నాటి ఐసీయూలో చికిత్స తీసుకున్నారు.   చివరికి పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. కాగా ప్రస్తుతం ఆయన వయసు 91 ఏళ్లు. కాగా జూన్ 13వ తేదీన మిల్కాసింగ్ భార్య నిర్మల చనిపోగా ఇక నేడు దిగ్గజ చాక్లెట్ దూరమయ్యాడు .




 ఇలా భారత క్రీడా రంగానికి ఎనలేని సేవలు చేసి కీర్తిప్రతిష్టలు సాధించిన ఇద్దరు భార్యాభర్తలు వారం వ్యవధిలో మృతి చెందడం క్రీడా రంగాన్ని విషాదంలో ముంచెత్తింది. అటు అభిమానులు కూడా అందరూ విషాదంలో మునిగిపోయారు. మిల్కా సింగ్ ఆసియన్ గేమ్స్ లో ఎన్నోసార్లు భారత్ కి గోల్డ్ మెడల్ అందించాడు. ఇప్పటికీ ఎంతో మంది యువ ఆటగాళ్లకు మిల్కాసింగ్ జీవితం పూర్తిగా స్ఫూర్తిదాయకమే. 1958 కామన్ వెల్త్ గేమ్స్ లో కూడా మిల్కాసింగ్ గోల్డ్మెడల్ సొంతం చేసుకున్నారు  కాగా మిల్కాసింగ్ దంపతులకు ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇక మిల్కా సింగ్ కుమారుడు జీవ్ మిల్కా సింగ్  ప్రస్తుతం గోల్ఫర్ గా రాణిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: