మీరాబాయి చాను..  ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.. మహిళా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఒలింపిక్స్ లో భారత్ పథకం గెలుచుకుని దాదాపు రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ ఏ ఒక్క మహిళ కూడా వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ తరఫున పథకం సాధించలేదు.  వెయిట్ లిఫ్టింగ్ లో పథకం అంటే భారత్ కు అందని ద్రాక్షలా మారిపోయింది.  2000 సంవత్సరంలో కరణం మల్లేశ్వరి ఒలింపిక్స్ లో భారత్ తరఫున కాంస్య పతకాన్ని సాధించింది.  అప్పటి నుంచి మొన్నటి వరకూ ఎవరూ కూడా ఆ ఘనత అందుకోలేక పోయారు.


 కానీ ఇటీవలే ఒక పేద కుటుంబంలో పుట్టి పట్టుదలతో ఎదిగి ఏకంగా భారత గౌరవాన్ని నిలబెట్టింది ఒక మహిళ. రెండు దశాబ్దాల నిరీక్షణను స్వస్తి పలికి ఏకంగా భారత మహిళా వెయిట్లిఫ్టింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది మీరాబాయి చాను. ఇక మహిళా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించిన మొట్టమొదటి మహిళ గా కూడా సరికొత్త చరిత్ర సృష్టించింది.  ఇక ఒలంపిక్స్ లో అద్భుతంగా రాణించిన మీరాబాయి చాను ఇటీవలే మణిపూర్ ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించింది. అంతేకాదు ఏసీపీ గా ఉద్యోగాన్ని కూడా ఇస్తూ నిర్ణయం తీసుకుంది.  ఇకపోతే ఇటీవలే జూనియర్ మీరాబాయి చాను  కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



 టోక్యో ఒలంపిక్స్ వెయిట్ లిఫ్టర్ అయినా మీరాబాయి చానునీ స్ఫూర్తిగా  తీసుకుంది ఇక్కడ ఒక చిన్నారి . ఈ క్రమంలోనే టీవీలో మీరాబాయి చాను ఒలంపిక్స్ లో   వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియో చూస్తూ ఇక అదే మాదిరిగా వెయిట్ లిఫ్టింగ్ చేసింది ఇక్కడ ఒక చిన్నారి. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఆ చిన్నారి ఇలా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న సమయంలో తల్లిదండ్రులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అయితే దీనిపై గౌతం ఆదాని స్పందిస్తూ చాలా తొందరగా ప్రేరణ పొందావు. చాలా ముందే కలలు కన్నావు.. మీరాబాయి చాను నువ్వు నిజంగా ఎంతో మందికి స్ఫూర్తి  అంటూ కామెంట్ పెట్టారు. అంతే కాకుండా ఎంతో మంది నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: