ప్రస్తుతం యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా జట్టు శ్రీలంక పర్యటన లో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టి20 సిరీస్ ఆడుతుంది భారత జట్టు  ఇక ఇప్పటికే వన్డే సిరీస్ పూర్తి చేసుకుంది భారత జట్టు   ఐదు వన్డే సిరీస్ లలో భాగంగా అద్భుతంగా రాణించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ కైవసం చేసుకుంది భారత జట్టు.  టి20 సిరీస్ లో కూడా అదే దూకుడు కొనసాగిస్తోంది.  ఈ క్రమంలోనే t20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ కూడా విజయాన్ని సాధించింది టీమిండియా జట్టు. ఇక t20 సిరీస్ లో భాగంగా రెండవ మ్యాచ్ కూడా గెలిచి మళ్లీ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంటుంది అని అందరూ అనుకున్నారు.



 అయితే ఎట్టి పరిస్థితుల్లో టీ20 సిరీస్ గెలిచి పరువు నిలబెట్టుకోవాలని అటు శ్రీలంక జట్టు కూడా ఎంతో పట్టుదలతో ఉంది   ఈ క్రమంలోనే నిన్న మ్యాచ్ ఎంతో హోరాహోరీగా జరుగుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అంతలోనే ప్రేక్షకులకు ఊహించని షాక్ తగిలింది   ప్రస్తుతం టీమిండియా జట్టులో ఉన్న కృనాల్ పాండ్య కు ఇటీవలే కరోనా సోకింది. దీంతో ఇక నిన్న జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ కూడా వాయిదా పడాల్సిన పరిస్థితులు వచ్చాయి  అయితే కృనాల్ పాండ్యా తో సన్నిహితంగా ఉన్నా మరో ఏడుగురికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా నెగిటివ్ అని వచ్చింది.



 ఇకపోతే ఈరోజు టీమ్ ఇండియా శ్రీలంక మధ్య నేడు రెండవ t20 మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ రెండవ టీ 20 మ్యాచ్ ఎలా ఉండబోతుంది అన్నదానిపై మరోసారి ప్రేక్షకులు అందరిలో కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. సొంతగడ్డపై పూర్తిగా క్లీన్ స్వీప్ అవ్వడానికి సిద్ధంగా లేని లంక జట్టు రెండవ టీ 20 మ్యాచ్ గెలిచి ఇంకా సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది   అదే సమయంలో మరోసారి దూకుడుగా ఆడి ఇక ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ కైవసం చేసుకోవాలని అటు యువ ఆటగాళ్లతో కూడిన కూడా ఎంతగానో ఆతృతగా ఉంది. నేడు జరగబోయే రెండో టి 20 మ్యాచ్ లో ఎవరు పైచేయి సాధిస్తారు అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: