రెండవ దశ ఐపీఎల్ నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ రెండవ దశ ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎలా రాణించ బోతుంది అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే ప్రతి సారి భారీ అంచనాలతో బరిలోకి దిగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ వరుస అపజయాలతో చివరికి లీగ్ దశలోనే వెనుదిరుగుతూ ఉంటుంది.



 ఇక గత ఏడాది కూడా ఒక్క అడుగు దూరం తో ఓటమిపాలు అయ్యి లీగ్ దశ తో సరిపెట్టుకుంది  అయితే ఈ ఏడాది మాత్రం ఎంతో దూకుడుగా ఆడుతుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఇటీవల కొంతమంది కొత్త ఆటగాళ్లు రావడంతో ఎంతో పటిష్టంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ సారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలవడం ఖాయం అనుకుంటున్న సమయంలో మళ్లీ సెకండ్ వేవ్ ఐపీఎల్ వల్ల ఐపీఎల్ వాయిదా పడింది.


 కాగా నేటి నుంచి ఐపీఎల్ రెండో దశ ప్రారంభం అవుతుంది. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు  రేపు మ్యాచ్ ఆడనుంది.  ఈసారి  బెంగళూరు జట్టు ఎలా రాణిస్తుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే తాజాగా దీనిపై స్పందించిన విరాట్ కోహ్లీ మొదటి సీజన్లో ఎలా ఆడామో.. ఇప్పుడు కూడా అలాగే అంతే కసితో ఎంతో పట్టుదలతో బరిలోకి దిగుతామని అంటూ చెప్పుకొచ్చాడు కోహ్లీ. ఇటీవలే ఆడం జంపా, కేన్ రిచర్డ్సన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వదిలి వెళ్లగా.వారి స్థానంలో శ్రీలంక ఆటగాళ్లు వచ్చారు. వారికి యూఏఈ పిచ్ లపై  ఎలా ఆడాలో తెలుసు. వీరి నైపుణ్యం జట్టుకు ఎంతో కలిసొస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇప్పటికే ఐపీఎల్ సీజన్ లో మ్యాచ్లు ఆడిన అనుభవం ఉండడంతో ఇక పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా అర్థం చేసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: