సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన ఎనమిది మ్యాచ్ లలో ఏడు మ్యాచ్ లు ఓటమి పాలయింది. ఇలా వరుసగా ఎడు మ్యాచ్ లలో ఒక జట్టు ఓడిపోవడం ఐపీఎల్ చరిత్రలో మొత్తం కేవలం ఐదు సార్లే జరిగింది. మొట్ట మొదటి సారి 2009 లో కలకత్త నైట్ రైడర్స్ కూడా వరసు గా ఎడు మ్యాచ్ లలో ఓటమి పాలయింది. అలాగే మరొక సారి 2019 లో రాయల్ చాలేంజర్స్ బెంగళూర్ కూడా వరుసగా ఎడు మ్యాచ్ లను ఓడిన చెత్త రికార్డు ను ముట్ట గట్టుకుంది. మళ్లి ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా వరుసగా ఏడు మ్యాచ్ లలో అపజయాలను ఎదుర్కొంది. అసలు ఈ సిజన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఏ మాత్రం కలిసి రావడం లేదు. మొదటి నుంచి అన్ని అవరొదాలను ఎదుర్కొంటునే ఉంది. వార్నర్ ను కెప్టెన్ గా తొలగించడం.. గాయం కారణంగా నటరాజన్ మొదటి ఫేజ్ కు లేక పోవడం. అలాగే జానీ బెయిర్ స్ట్రో రెండో విడుత మ్యాచ్ లకు దూరం అవడం. వంటి అవరోదాలను ఎదుర్కోంది.
ఇదిలా ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఇప్పుడు ఆడే ఆరు మ్యాచ్ లలో ప్రతి మ్యాచ్ తప్పని సరిగా విజయం సాధించాలి. అది కూడా పెద్ద విజయాలు అయి ఉండాలి. దీంతో 14 పాయింట్లు వస్తాయి. అప్పుడు నెట్ రన్ రేట్ కూడా భారీ గా ఉండాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రస్తుతం నెట్ రన్ రేట్ -7 గా ఉంది. ఇది ప్లే ఆఫ్స్ చేరేలా మారాలంటే ఎదో అద్భతం జరగాలని క్రికెట్ విశ్లషకులు అంటున్నారు. జట్టు ఇప్పుడు ఉన్న పరిస్థితు లల్లో ఇది సాధ్యం అవడం కష్టం గా ఉందని అభిమానులు అంటున్నారు. ఎది ఏమైనా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది ఐపీఎల్ నుంచి దాదాపు నిష్కమించినట్టే అని అభిమానులు, విశేషకులు అభిప్రాయ పడుతున్నారు.