ఒకే జట్టుపై వెయ్యి రన్స్ చేసిన ఏకైక బ్యాట్స్మెగాన్గా నిలిచాడు రోహిత్ శర్మ. హిట్మ్యాన్ అంటే ఏంటో మరోసారి నిరూపించాడు రోహిత్శర్మ. ఇప్పటి వరకు ఏ ఆటగాడికి సాధ్యంకాని ఫీట్ను అధిగమించాడు. కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 33 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఐపీఎల్లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు హిట్మ్యాన్. నాలుగో ఓవర్లో, వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు కొట్టి ... ఒకే టీమ్పై వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ.
ఐపీఎల్ చరిత్రలో ఇలా ఒకే జట్టుపై 1000 పరుగుల మార్క్ని అందుకున్న ఏకైక బ్యాట్స్మెన్ రోహిత్ శర్మనే కావడం గమనార్హం. ఐపీఎల్ లో కోల్కతా నైట్రైడర్స్ పై ఇప్పటి వరకూ 1011 పరుగులు చేశాడు హిట్ మ్యాచ్ రోహిత్ శర్మ. అతని తర్వాత స్థానంలో ఈ రికార్డ్లో ఉన్నాడు హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్. పంజాబ్ కింగ్స్పై ఇప్పటి వరకూ 943 పరుగులు చేశాడు డేవిడ్ వార్నర్. అలానే కోల్కతా పై కూడా 915 పరుగులు చేసిన మూడో స్థానంలోనూ కొనసాగుతున్నాడు వార్నర్. ఇక ఢిల్లీపై 909 రన్స్ చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు కోహ్లీ.