టీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ కోసం ఐసీసీ రూపొందించిన జాబితాలో భాగంగా... మరో 8 మంది ఆటగాళ్లను యూఏఈలోనే బయో బబుల్లో ఉంచారు అధికారులు. టీమిండియా జట్టుకు అందుబాటులో ఉండే విధంగా... మొత్తం 15 మంది జట్టు సభ్యులతో పాటు మరో 8 మంది ప్లేయర్స్ను కూడా బయో బబుల్లోనే ఉంచింది భారత జట్టు మేనేజ్మెంట్. వీరంతా కూడా టోర్నీ ముగిసే వరకు దుబాయ్లోనే బయో బబుల్లో జట్టుకు అందుబాటులో ఉంటారు. 8 మంది జాబితాలో ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ తరఫున ఆడుతున్నఅవేష్ ఖాన్, సన్ రైజర్స్ ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్, బెంగళూర్ క్రికెటర్స్ హర్షల్ పటేల్, మేరీవాలా, వెంకటేష్ అయ్యర్, కరణ్ శర్మ, కృష్ణప్ప గౌతమ్, షాబాజ్ అహ్మద్ ఉన్నారు. వీరంతా కూడా టీమిండియా జట్టుతో పాటే యూఏఈలోని బయో బబుల్లో ఉంటారు. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న హార్థిక్ పాండ్యాపై వేటు పడుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా అక్షర్ పటేల్ను జట్టు పక్కన పెట్టింది. ఇక భువనేశ్వర్ కుమార్ గురించి కూడా ప్రస్తావించలేదు.
టీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ కోసం ఐసీసీ రూపొందించిన జాబితాలో భాగంగా... మరో 8 మంది ఆటగాళ్లను యూఏఈలోనే బయో బబుల్లో ఉంచారు అధికారులు. టీమిండియా జట్టుకు అందుబాటులో ఉండే విధంగా... మొత్తం 15 మంది జట్టు సభ్యులతో పాటు మరో 8 మంది ప్లేయర్స్ను కూడా బయో బబుల్లోనే ఉంచింది భారత జట్టు మేనేజ్మెంట్. వీరంతా కూడా టోర్నీ ముగిసే వరకు దుబాయ్లోనే బయో బబుల్లో జట్టుకు అందుబాటులో ఉంటారు. 8 మంది జాబితాలో ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ తరఫున ఆడుతున్నఅవేష్ ఖాన్, సన్ రైజర్స్ ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్, బెంగళూర్ క్రికెటర్స్ హర్షల్ పటేల్, మేరీవాలా, వెంకటేష్ అయ్యర్, కరణ్ శర్మ, కృష్ణప్ప గౌతమ్, షాబాజ్ అహ్మద్ ఉన్నారు. వీరంతా కూడా టీమిండియా జట్టుతో పాటే యూఏఈలోని బయో బబుల్లో ఉంటారు. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న హార్థిక్ పాండ్యాపై వేటు పడుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా అక్షర్ పటేల్ను జట్టు పక్కన పెట్టింది. ఇక భువనేశ్వర్ కుమార్ గురించి కూడా ప్రస్తావించలేదు.