భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఆకర్షణ మారె మ్యాచ్ కు ఉండదు. ఓ టోర్నీలో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి అంటే ఆ మ్యాచ్ కు వచ్చే ఆదాయం ఫైనల్ మ్యాచ్ కు వచ్చే ఆదాయం కంటే ఎక్కువగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం ఉండదు. అయితే ఈరోజునుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఐసిసి టీ20 ప్రపంచ కప్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రపంచ కప్ టోర్నీలో ఒకే గ్రూప్లో ఉన్న భారత్-పాకిస్థాన్ జట్లు ఈ నెల 24 న తమ తమ మొదటి మ్యాచ్లలో ఎదురు పడనున్నాయి. అయితే ఈ టోర్నీ యొక్క బ్రాడ్కాస్టింగ్ స్టార్ స్పోర్ట్స్ సంస్థకు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ కోసం స్టార్ స్పోర్ట్స్ సంస్థ తయారు చేసిన ఒక యాడ్ భారత జట్టు అభిమానులను అలరిస్తుంది. దాంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ యాడ్ లో పాకిస్తాన్ ను సపోర్ట్ చేస్తున్నట్టు ఓ వ్యక్తి క్రాకర్స్ పట్టుకుని టీవీ షాప్ లోకి... ప్రపంచ కప్ వస్తున్నందున ఒక టీవీని కొనుగోలు చేయడానికి వస్తాడు. అక్కడ షాపు యజమాని అతనికి ఒక్క టీవీ అడుగుతే రెండు టీవీలు ఇస్తాడు. ఈ రెండు ఎందుకు అని ఎదుటి వ్యక్తి ప్రశ్నించగా.. ప్రపంచకప్ లో మాపై ఎప్పుడూ గెలవలేదు. అందువల్ల క్రాకర్స్ పెలవు... కాబట్టి ఏదో ఒకటి పేలాలి అనాలి కదా ఉంటున్న సమయంలో భారత జట్టు చేతిలో పాక్ ఓడిపోయిన కారణంగా పాకిస్తాన్ అభిమానులు తమ టీవీలను పగలగొట్టుకునే వీడియోలను అక్కడ చూపిస్తారు. అంటే ఈసారి కూడా భారత్ పై పాకిస్థాన్ ఓడిపోవడం.. అలాగే పాక్ అభిమానులు టీవీలు పగలకొట్టుకోవడం చేస్తారని చెప్పకనే చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: