ఇక ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆల్ రౌండర్ గా మారిపోయిన హార్దిక్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో కూడా టీమిండియా జట్టులో స్థానం సంపాదించుకోవడం గమనార్హం. ఇకపోతే ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యా తన పర్సనల్ విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు ధోనితో తనకు ఉన్న బంధం గురించి కూడా చెప్పుకొచ్చాడు. తన కెరీర్లో బాగా రాణించడానికి మహేంద్ర సింగ్ ధోనీ కారణం అంటూ తెలిపాడు హార్దిక్ పాండ్యా.
అయితే గతంలో కాఫీ విత్ కరణ్ జోహార్ కార్యక్రమంలో హార్దిక్ పాండ్యా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా ఏకంగా బీసీసీఐ హార్దిక్ పాండ్యా పై రెండేళ్ల పాటు నిషేధించింది. ఇక ఆ సమయంలో జరిగిన పరిణామాలను గుర్తుచేసుకున్నాడు హార్దిక్ పాండ్యా. తనపై బిసిసిఐ విధించిన సస్పెన్షన్ ముగిసిన తర్వాత 2019లో న్యూజిలాండ్ టూర్ కు తాను ఎంపికయ్యాను.. ఆ సమయంలో తనకు హోటల్లో రూమ్ దొరకలేదు. ఇక అప్పుడు ఇబ్బంది పడతానని భావించి మహేంద్ర సింగ్ ధోనీ తన రూమ్ లోకి ఆహ్వానించాడు. ఆ సమయంలో ధోని రూమ్ లో ఒకటే బెడ్ ఉంది దీంతో ధోనీ కింద పడుకుని తన బెడ్ నాకు ఇచ్చాడు అంటూ హార్దిక్ పాండ్య గుర్తు చేసుకున్నాడు. ధోని ఒక గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు హార్దిక్ పాండ్య .