టీ-20 ఫార్మెట్లో కెప్టెన్గా తనదైన ముద్ర వేసిన మహేంద్రసింగ్ ధోని అనుభవం అటు యువ ఆటగాళ్లు అందరికీ కూడా ఉపయోగపడుతుంది అని అటు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా వ్యాఖ్యానించారు. కాగా ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోనీ యూఏఈ లో టీమిండియాతో చేరిపోయి అందరి ఆటగాళ్లకు కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఉండడం గమనార్హం. ఇక రేపు పాకిస్థాన్తో తొలి మ్యాచ్ ఆడనుంది టీమ్ ఇండియా జట్టు. ఈ క్రమంలోనే ధోని ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా ఆటగాళ్లతో కలిసి పని చేస్తున్నాడు. అయితే టీమిండియాకు మెంటార్ గా నియమించబడిన మహేంద్ర సింగ్ ధోనీ ఇక ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తాడు. త్రో డౌన్ స్పెషలిస్ట్ గా మారి బౌలింగ్ చేస్తూ కనిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను బిసిసీఐ అభిమానులతో పంచుకుంది.
టీమిండియా నూతన త్రో డౌన్ స్పెషలిస్ట్ మహేంద్రసింగ్ ధోని అంటూ పరిచయం చేస్తూ బిసిసిఐ ట్విట్ పెట్టింది. ఇక ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఇది చూస్తుంటే మహేంద్ర సింగ్ ధోనీ అటు టీమిండియా వరల్డ్ కప్ గెలవడానికి సాయశక్తులా సహాయ సహకారాలు అందిస్తున్నాడు అన్నది అర్థమవుతుంది. అయితే ఇలా టీమిండియాకు సలహాలు సూచనలు ఇవ్వడానికి ధోని బిసిసిఐ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అనే విషయాన్ని ఇటీవలే బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పిన విషయం తెలిసిందే.