ప్రస్తుత వన్డే క్రికెట్ చాంపియన్ ఇంగ్లండ్ తో పాటు మాజీ చాంపియన్ వెస్టిండిస్, ప్రపంచ కప్ రన్నరప్ న్యూజిలాండ్ జట్ల తోనే ప్రధానంగా భారత్ కు గట్టి పోటీ తప్పదు. ఇంగ్లండ్ జట్టు ప్రపంచ కప్ కు ముందు నుంచే ఎలా రాటు దేలుతూ వస్తోందో చూస్తూనే ఉన్నాం. అయితే వార్మప్ మ్యాచ్ లో ఆ జట్టును చిత్తు గా ఓడించి భారత్ కావాల్సినంత ఆత్మ విశ్వాసం అయితే పోగేసుకుంది. అయితే ఇంగ్లండ్ ను కీలకమైన నాకౌట్ మ్యాచ్ లలో నమ్మడానికి వీలులేదు.
ఇక వెస్టిండిస్ జట్టు టీ 20 పోటీల్లో ఎంత ప్రమాద కారో తెలిసిందే. ఈ జట్టులో విధ్వంస కరమైన ఆటగాళ్లు ఉన్నారు. వీరు మ్యాచ్ ను క్షణాల్లో మార్చేస్తారు. పైగా ఈ ఫార్మాట్లో వెస్టిండిస్ జట్టు రెండు సార్లు చాంపియన్ అయ్యింది. ఇక మూడో జట్టు కీవీస్. కీవీస్ ఎప్పుడు అయినా పెద్ద జట్లకు షాక్ ఇచ్చేందుకు రెడీ గా ఉంటుంది. మొన్న ప్రపంచకప్ సెమీ స్లో సైతం ఏకంగా భారత్ ను ఓడించింది. అందుకే ఈ మూడు జట్ల తో జరిగే మ్యాచ్లో భారత్ జాగ్రత్తగా ఉంటే కప్ను గెలిచే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి.