ఈరోజు దుబాయ్‌లో జరగనున్న టీ 20 ప్రపంచకప్ సూపర్ 12 మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌తో తలపడుతున్నాయి. ఒమన్ మరియు యుఎఇలో జరుగుతున్న టి 20 ప్రపంచకప్‌లో ఇరు జట్లకు ఇది మొదటి మ్యాచ్. అయితే పాకిస్థాన్‌తో జరిగిన ఐదు టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో భారత్ అజేయంగా ఉన్న కూడా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పాకిస్థాన్ జట్టును తేలికగా తీసుకోవడం లేదు. భారత కెప్టెన్ పాక్ తో క్లాష్‌కు కు ముందు మాట్లాడుతూ... పాకిస్తాన్ తమ జట్టులో చాలా మంది గేమ్-ఛేంజర్‌లను కలిగి ఉన్నారని మరియు పాక్ ను ఓడించడానికి భారత జట్టు తన "నెంబర్ వన్ గేమ్" తీసుకురావాలని చెప్పాడు.

అయితే పాకిస్థాన్ జట్టు బలంగా ఉంది, మీరు ప్రతిసారీ వారితో మీ అత్యుత్తమ క్రికెట్ ఆడాలి. అవ్హబుతమైన ఆటగాళ్ళు జట్టులో ఉన్నారు. మేము ఖచ్చితంగా పాకిస్తాన్‌ పై మా అత్యుత్తమ గేమ్‌ను తీసుకురావాలి" అని కోహ్లీ ప్రీ-మ్యాచ్ వర్చువల్ విలేకరుల సమావేశంలో చెప్పాడు.

ఇక మ్యాచ్‌ లోకి వెళితే, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై భారత్ ఇప్పటికీ చెమటలు పట్టిస్తోంది. 28 ఏళ్ల అతను ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో ముంబై ఇండియన్స్ తరఫున బ్యాటింగ్ స్పెషలిస్ట్‌గా ఆడాడు, యుఎఇ లెగ్‌లో ఒక్క ఓవర్ కూడా వేయలేదు. హార్దిక్ ప్రస్తుతం బౌలింగ్ చేయలేకపోవడం ప్లేయింగ్ ఎలెవన్‌లో అతని స్థానం గురించి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. దాంతో హార్దిక్ గురించి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, "బౌలింగ్ చేయడానికి అతను ఇప్పుడిపుడే మెరుగవుతున్నాడు. ఈ టోర్నీలో అతను తప్పకుండ బౌలింగ్ చేస్తాడు అని కోహ్లీ తెలిపాడు. అలాగే మేము మా జట్టు కలయికల గురించి మాట్లాడాము.. ఇప్పుడే వాటిని వెల్లడించడం లేదు. మా వ్యూహాల అమలు విషయంలో నమ్మకం ఉంది అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: