ఒకవేళ భారత్ ఇద్దరు పేసర్లు - మహ్మద్ సిరాజ్ మరియు ఇషాంత్ శర్మలతో వెళ్లాలని ఎంచుకుంటే, వారు మొదటి ఎంపికగా ఉండాలి. టీ20ల్లో ముగ్గురు పేసర్లతో భారత్ ఆడింది. ఆ టెంప్లేట్ ప్రకారం వెళితే, ఉమేష్ యాదవ్ మరియు ప్రసిద్ధ్ కృష్ణ మధ్య పోటీ ఉండవచ్చు. కాకపోతే, బ్యాట్ మరియు బంతి రెండింటితో జట్టుకు అదనపు పరిపుష్టిని అందించే అక్షర్ పటేల్ను భారత్ తీసుకువస్తుంది అని తెలుస్తుంది. దాంతో రేపటి మ్యాచ్ లో జడేజా, అశ్విన్, అక్షర్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు బరిలోకి భారత జట్టు దిగనున్నారు అని తెలుస్తుంది
భారత అంచనా జట్టు: శుభ్మాన్ గిల్, మయాంక్ అగర్వాల్, పుజారా, శ్రేయాస్ అయ్యర్, అజింక్య రహానే (c), వృద్ధిమాన్ సాహా (wk), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ సిరాజ్