49 రన్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స ఆరంభించిన టీమిండియాకు కేవలం 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే సెంచరీ వీరుడు శ్రేయస్ అయ్యర్ మరోసారి భారత్ ఇన్నింగ్స్కు వెన్నెముకలా నిలిచాడు. అశ్విన్, వృధిమాన్ సాహాతో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. శ్రేయస్ 65, అశ్విన్ 32 రన్స్ చేసి అవుటవ్వగా, 61 పరుగులతో సాహా, అక్సర్ పటేల్ 28 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. 284 పరుగులు టార్గెట్తో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. యంగ్ 2 పరుగులు చేసి అవుటయ్యాడు. లాథమ్, సోమర్, విలియమ్సన్ మినహా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు. 155 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన దశలో దాదాపు ఓటమి అంచున ఉన్న కివీస్ను రవిన్ రవీంద్ర, పటేల్ జోడి కాపాడింది. చివరి వరకు మరో వికెట్ పడకుండా భారత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. చివరికి ఫలితం కోసం దాదాపు 5 ఓవర్లు ఎక్కువ ఆడించేందుకు ప్రయత్నించినప్పటికీ... వెలుతురు సరిగా లేని కారణంగా మ్యాచ్ రద్దయినట్లు మ్యాచ్ రిఫరీ వెల్లడించారు. దీంతో 38 ఏళ్లుగా కాన్పూర్లో ఓటమి లేకుండా కాపాడుకుంటున్న రికార్డును టీమిండియా కాపాడుకుంది.
49 రన్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స ఆరంభించిన టీమిండియాకు కేవలం 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే సెంచరీ వీరుడు శ్రేయస్ అయ్యర్ మరోసారి భారత్ ఇన్నింగ్స్కు వెన్నెముకలా నిలిచాడు. అశ్విన్, వృధిమాన్ సాహాతో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. శ్రేయస్ 65, అశ్విన్ 32 రన్స్ చేసి అవుటవ్వగా, 61 పరుగులతో సాహా, అక్సర్ పటేల్ 28 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. 284 పరుగులు టార్గెట్తో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. యంగ్ 2 పరుగులు చేసి అవుటయ్యాడు. లాథమ్, సోమర్, విలియమ్సన్ మినహా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు. 155 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన దశలో దాదాపు ఓటమి అంచున ఉన్న కివీస్ను రవిన్ రవీంద్ర, పటేల్ జోడి కాపాడింది. చివరి వరకు మరో వికెట్ పడకుండా భారత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. చివరికి ఫలితం కోసం దాదాపు 5 ఓవర్లు ఎక్కువ ఆడించేందుకు ప్రయత్నించినప్పటికీ... వెలుతురు సరిగా లేని కారణంగా మ్యాచ్ రద్దయినట్లు మ్యాచ్ రిఫరీ వెల్లడించారు. దీంతో 38 ఏళ్లుగా కాన్పూర్లో ఓటమి లేకుండా కాపాడుకుంటున్న రికార్డును టీమిండియా కాపాడుకుంది.