సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీకి అటు బిసిసిఐ అధికారులకు పోసగడం లేదని.. అందుకే మనసు ఒప్పుకోకపోయినా కోహ్లీ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నాడు అన్న మాట మాత్రం ప్రతి ప్రేక్షకుడు అనుకుంటున్నది. ఇక వరుసగా జరుగుతున్న ఘటనలు ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. విరాట్ కోహ్లీనీ వన్డే కెప్టెన్సీ నుండి తప్పించిన కూడా తన చిరునవ్వుతోనే స్వాగతించాడు. తనకు ఇష్టం లేకపోయినప్పటికీ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారు అన్న బాధ లోపల ఎంత ఉన్నప్పటికీ జట్టు ఆటగాళ్లకు మాత్రం అది తెలియకుండా సౌత్ఆఫ్రికా పర్యటనలో చిరునవ్వుతోనే జట్టును ముందుకు నడిపించాడు.
ఇక సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ విజయం సాధించి తన కెప్టెన్సీ సత్తా ఎంతో బిసిసిఐకి నిరూపించాలి అని అనుకున్నాడు. కానీ ఏం చేస్తాం అన్నీ అనుకున్నట్లు జరిగితే మనం మనుషులం ఎందుకు అవుతాము. దేవుళ్లము అవుతాం కదా విరాట్ కోహ్లి విషయంలో కూడా ఇదే జరిగింది. సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్లో మొదటి మ్యాచ్ గెలిచి శుభారంభం చేసిన కోహ్లీ సేనకు తర్వాత రెండు మ్యాచ్ లలో కూడా నిరాశ తప్పలేదు. దీంతో 1-2 తేడాతో చేజార్చుకుంది టీమ్ ఇండియా.