ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. లీగ్ మ్యాచ్ లూ ప్రస్తుతం ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ప్లేఆఫ్ లో అవకాశాలు దక్కించుకునేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ జట్టు జట్టు ప్లే ఆఫ్ లో అడుగు పెట్టిన మొదటి  జట్టుగా నిలిచింది. దీంతో మిగిలిన మూడు మ్యాచ్ ల కోసం ప్రస్తుతం ఏడు జట్లు పోటీ పడుతున్నాయి అనే చెప్పాలి. దీంతో కొన్ని జట్లకు అయితే ఆడిన ప్రతీ మ్యాచ్లో కూడా తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 కొన్ని జట్లకు తమ గెలుపు తో పాటు ఇతర జట్ల ఓటమి పైన కూడా ప్లే ఆప్ కి వెళ్లడం ఆధారపడి ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఆసక్తికరంగా మారింది. ప్రేక్షకులు మిస్ అవ్వకుండా మ్యాచ్ వీక్షిస్తూ ఉన్నారు. ఇకపోతే నేడు ఐపీఎల్ లో భాగంగా మరో ఆసక్తికరమైన పోరు జరగబోతుంది. పంజాబ్ కింగ్స్ ఢిల్లీ కాపిటల్స్ మధ్య సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే అటు ఢిల్లీ కాపిటల్ జట్టుకు పంజాబ్ కి మధ్య నేడు జరగబోయే మ్యాచు డూ ఆర్ డై మ్యాచ్ అనే చెప్పాలి.


 ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ రెండు జట్లు కూడా విజయం సాధించాల్సిందే. కానీ ఒక్కరు మాత్రమే విజేతలుగా నిలుస్తారు. దీంతో ఆ ఒక్కరు ఎవరు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ రెండు జట్లు తలపడిన సమయంలో గత రికార్డులను చూసుకుంటే.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 15 విజయాలు సాధించగా.. అటు పంజాబ్ కింగ్స్ జట్టు 14 విజయాలు సాధించింది. ఇక ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ ఐదవ స్థానంలో కొనసాగుతూ ఉంటే..  పంజాబ్ కింగ్స్ జట్టు ఏడవ స్థానంలో కొనసాగుతోంది. మరి నేడు ఎవరు గెలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl