ఐపీఎల్ లో భాగం గా నేడు ఒక ఆసక్తికరమైన పోరు జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఇక ఐపీఎల్ లో రెండు జట్ల భవిష్యత్తును తేల్చ బోతుంది. ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు  పాయింట్ల  పట్టిక లో 4వ స్థానం లో కొనసాగుతోంది. అదే సమయం లో అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐదవ స్థానం లో ఉంది. నేడు ఢిల్లీ క్యాపిటల్స్ ఓడి పోతే అటు బెంగళూరు జట్టు ప్లే ఆప్ లో అడుగు పెడుతుంది. పొర పాటున ఢిల్లీ జట్టు గెలిస్తే చివరికి బెంగుళూరు ఇంటి దారి పట్టాల్సిందే.


 ఈ క్రమం లోనే ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు అందరూ కూడా ఢిల్లీ జట్టు చేతి లో చిత్తుగా ఓడి పోవాలి అంటూ బలం గా కోరుకుంటున్నారు అని చెప్పాలి. కేవలం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు మాత్రమే కాదు జట్టు లోని ఆటగాళ్లు సైతం నేడు జరగబోయే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోతే బాగుండు అని కోరుకుంటున్నారూ. ఇక ప్రస్తుతం బెంగళూరు జట్టు లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న  మాక్స్వెల్ ముంబై ఇండియన్స్ విజయం సాధించాలని కోరుకున్నాడు.


 మేము కోల్కతా వెళ్లడం.. ఆపై ఫైనల్ ఆడాలని ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాము.. ఇదే జరిగితే మేము టైటిల్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అయితే ఇదంతా జరగాలంటే ముందు ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించాలి. ఇక రిషబ్ పంత్ సేన ఓటమి పాలు కావాలని కోరుకుంటున్నాను అంటూ మాక్స్వెల్ చెప్పుకొచ్చాడు. కాగా నేడు ఏం జరగబోతుందో అని అటు బెంగళూరు జట్టు  అభిమానులు అందరూ కూడా ఉత్కంఠగా మ్యాచ్ వీక్షించేందుకు సిద్ధమైపోయారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl