ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా ఇక వీరి విషయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రవర్తించిన తీరు మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. మొదటి రోజు ఆట లో భాగంగా రిషబ్ పంత్ సెంచరీ చేసిన సమయంలో డగౌట్ లో ఉన్న రాహుల్ ద్రవిడ్ గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేశాడు. ఒకరకంగా ఎగిరి గంతేసినంత పని చేశాడు. అయితే ఎప్పుడూ సైలెంట్గానే ప్రోత్సహించే రాహుల్ ద్రవిడ్ ఇలా ఎంజాయ్ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ తర్వాత రవీంద్ర జడేజా సెంచరీ చేసిన సమయంలో మాత్రం రాహుల్ ద్రవిడ్ నుంచి ఇలాంటి రియాక్షన్ కనిపించలేదు.
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం జడేజా సెంచరీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి సెలబ్రేట్ చేస్తూ అభినందనలు తెలిపాడు. ఇక సిరాజ్ సైతం అభినందనలు తెలిపాడు. అయితే వీరిద్దరి వెనక నిలబడి ఏదో మొక్కుబడిగా సెలబ్రేట్ చేరుతున్నట్లు కనిపించాడు ద్రావిడ్. అయితే ఈ ఏడాది ఆరంభంలోనే రవీంద్ర జడేజా టెస్ట్ మ్యాచ్లో సెంచరీ కి చేరిన సమయంలో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. ఇక ఏది ఏమైనా ప్రస్తుతం రిషబ్ పంత్, రవీంద్ర జడేజా విషయంలో అటు రాహుల్ ద్రవిడ్ వ్యవహరించిన తీరు మాత్రం చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి.