సాధారణంగా ఉత్కంఠభరితంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అటు అటు ఆటగాళ్ల మధ్య కొన్ని కొన్ని సార్లు మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒకరిని ఒకరు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వారి ఏకాగ్రతను చెడగొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా భారత్ మ్యాచ్  జరిగిన సమయంలో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పాలి. కానీ కొన్ని కొన్ని సార్లు ఇంగ్లండ్ ఆటగాళ్లు సైతం కవ్వింపు లకు  పాల్పడుతుంటారు. మైదానంలో  ఎంతో దూకుడుగా వ్యవహరించే విరాట్ కోహ్లీ ఇక ఆటగాళ్లను కవ్వింపు లకు   పాల్పడుతూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటాడు అని చెప్పాలి.


  ప్రస్తుతం ఇంగ్లండ్లో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన టెస్టు మ్యాచ్లో భాగంగా విరాట్ కోహ్లీ ఏకంగా జానీ బెయిర్ స్టో తో మాటల యుద్ధానికి దిగిన విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది అనే విషయం తెలుసిందే. ఈ క్రమంలోనే ఇద్దరు క్రికెటర్ల మధ్య  మాటల యుద్ధం కాస్త హాట్ టాపిక్గా మారిపోయింది. అయితే కోహ్లీతో మాటల యుద్ధం తర్వాత చెలరేగిపోయిన బెయిర్ స్టో ఏకంగా సెంచరీతో అదరగొట్టాడు. కోహ్లీ తనను ఏదో అనడం కారణంగానే జానీ బెయిర్ స్టో ఇక కోపానికి తన బ్యాటింగ్ లో చూపించాడు అంటూ ఎంతో మంది భావించారు. అయితే ఇటీవల ఇదే విషయంపై స్పందించాడు భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్.


 ఎప్పుడూ తనదైన శైలిలో స్పందిస్తూ సెటైరికల్ కామెంట్స్ చేసే వీరేంద్ర సెహ్వాగ్ ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ గొడవ గురించి కూడా అదే రీతిలో స్పందించాడు అన్నది  తెలుస్తోంది. కోహ్లీ బెయిర్ స్టో తో స్లెడ్జింగ్ చేయక ముందు అతని స్ట్రైక్ రేట్ 21 గా ఉంది విరాట్ కోహ్లీ అతనితో మాటల యుద్ధానికి దిగిన తర్వాత అతని స్ట్రైక్ రేటు ఒక్కసారిగా 150కి పెరిగిపోయింది.  పూజారా మాదిరిగా ఎంతో నెమ్మదిగా ఆడుతున్న అతన్ని అనవసరంగా గెలికిన విరాట్ కోహ్లీ రిషబ్ పంత్  మాదిరిగా మార్చి పరుగులు చేసేలా చేశాడు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించడంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: