ఈ సందర్భంగా మొదటిరోజు ఇన్నింగ్స్ లో భాగంగా టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించాడు ఏబి డివిలియర్స్. 111 బంతుల్లో రిషబ్ పంత్ 146 పరుగులు చేయడంతో ఆ తర్వాత అది జోరు కొనసాగించినా రవీంద్ర జడేజా 104 పరుగులతో వీరోచిత సెంచరీలతో కదంతొక్కిన విషయం తెలిసిందే. 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డును సృష్టించారు. ఈ క్రమంలోనే ఇటీవల రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ స్పందించిన ఎబి డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాను వేరే పనుల్లో బిజీగా ఉండటం కారణంగా ఇంగ్లాండ్ భారత్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ ను మిస్సయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు ఏబి డివిలియర్స్. కానీ మ్యాచ్ హైలెట్స్ మాత్రం చూశాను అంటూ చెప్పుకొచ్చాడు. తొలి ఇన్నింగ్స్ లో తీవ్ర ఒత్తిడిలో ఉండి కూడా ఇంగ్లండ్ పై కౌంటర్ అటాచ్ చేస్తూ రిషబ్ పంత్, రవీంద్ర జడేజా నెలకొల్పిన భాగస్వామ్యాన్ని టెస్ట్ క్రికెట్ లో ఇప్పటివరకు తాను చూడలేదు అంటూ తన సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. అద్భుతమైన షాట్ లతో రిషబ్ పంత్ రవీంద్ర జడేజా ఆకట్టుకున్నారు. వారి ఇన్నింగ్స్ నన్ను ఆశ్చర్యపరిచింది అంటూ చెప్పుకొచ్చాడు.