తనకు బాగా కలిసి వచ్చిన ఐపీఎల్ లోనూ జోరు చూపించలేక చతికిలబడ్డాడు. అయితే ఇప్పుడు తనకు కూడా ఇండియాలో చోటు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఇండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. అందులో భాగంగా రేపటి నుండి మూడు టీ 20 లు మరియు మూడు వన్ డే లు ఆడనుంది. ఇందులో కోహ్లీ మొదటి రెండు టీ 20 లకు వ్యక్తిగత కారణాల వలన దూరం అయ్యాడు. కాగా మూడవ మ్యాచ్ నుండి వన్ డే లలో ఆడనున్నాడు. ఈ నాలుగు మ్యాచ్ లలో కనుక కోహ్లీ కనీసం ఒక్క సెంచరీ అయినా సాధించకపోతే కోహ్లీ పై వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఎందుకంటే... ఇప్పుడు టీమ్ ఇండియా నిండా యువకులతో కూడిన పోటీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా దీపక్ హూడా నుండి ఎందరికో ఇబ్బంది కలుగుతుంది. అందుకే టైం కు కోహ్లీ పై సెలెక్టర్లు టార్గెట్ చేశారు. మరి కోహ్లీ పూర్వపు ఫామ్ ను అందుకుని జట్టులో మళ్ళీ రెగ్యులర్ ప్లేయర్ గా కొనసాగుతాడా లేదా అన్నది చూడాలి.