ఇటీవలే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మూడో వన్డే మ్యాచ్ శుభమన్ గిల్  అద్భుతమైన ఇన్నింగ్స్ గురించే ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు.  గ్రౌండ్ ను పూర్తిగా ఉపయోగించుకున్న యువ ఓపెనర్ శుభమన్ గిల్ సిక్సర్లతో చెలరేగిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 98 పరుగులతో టీమిండియా విజయంలో కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి. అయితే రెండు పరుగుల దూరంలో శుభమన్ గిల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. దీంతో దీని గురించి అందరూ చర్చించుకోవడం మొదలు పెట్టారు.


 ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ శుభమన్ గిల్ అదిరిపోయే ఇన్నింగ్స్ గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి.  అయితే ఇక మొత్తంగా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్లో మూడు మ్యాచ్ లలో 205 పరుగులు చేశాడు శుభమన్ గిల్. అయితే ఇక ఇటీవలే శుభమన్ గిల్ స్పందించింది ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఈ క్రమంలోనే కాస్త అత్యుత్సాహాన్ని చూపించింది అనే చెప్పాలి. శుభమన్ గిల్ 98 పరుగుల వద్ద సెంచరీ మిస్ చేసుకున్నాడు అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటే అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు యాజమాన్యం మాత్రం అత్యుత్సాహం తో వన్డే ఫార్మాట్ లో తొలి సెంచరీ నమోదు చేసిన శుభమన్ గిల్ కు కంగ్రాట్స్ అంటూ చెప్పేసింది.


 ఇది మీ కెరీర్లో ఫాస్టెస్ట్ సెంచరీ పర్ఫెక్ట్ ఇన్నింగ్స్ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. అయితే ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారిపోయింది. కాసేపటికే తప్పు తెలుసుకున్న బెంగళూరు ఫ్రాంచైజీ ఇక ఆ పోస్ట్ ని తొలగించింది. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎంతోమంది ఆ పోస్ట్ ని స్క్రీన్ షాట్ తీసి ఫన్నీ గా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే శుభమన్ గిల్ కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడటంతో ఆర్సిబి ఇక కాస్త ఆనందంలో ఆ పోస్ట్ పెట్టి ఉంటుందని మరి కొంత మంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: