ఇటీవల వెస్టిండీస్తో సిరీస్లో భాగంగా భారత జట్టు వన్డే సిరీస్ లో అదరగొట్టింది అన్న విషయం తెలిసిందే. వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించిన భారత జట్టు ఏకంగా 3-0 తేడాతో వెస్టిండీస్ జట్టును క్లీన్ స్వీప్ చేసింది. అయితే వరుసగా రెండు మ్యాచ్లలో ఎంతో ఉత్కంఠ మధ్య హోరాహోరీగా జరిగినా.. మూడో మ్యాచ్ మాత్రం భారత జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 117 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది భారత జట్టు.


 మూడో వన్డే మ్యాచ్లో భాగంగా వర్షం పలుమార్లు అంతరాయం కలిగించినప్పటికీ అంపైర్లు మాత్రం మ్యాచ్ కొనసాగించడానికి ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే 50 ఓవర్ల మ్యాచ్ కాస్తా 36 ఓవర్లకు కుదించారు. 36 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది భారత జట్టు. ఈ క్రమంలోనే డక్ వర్త్ లూయిస్ పద్ధతి లో వెస్టిండీస్ టార్గెట్ 257 పరుగులుగా నిర్దేశించగా.. కేవలం 137 పరుగులు మాత్రమే చేసి వెస్టిండీస్ ఆలవుట్ అయ్యింది. దీంతో భారీ తేడాతో విజయం సాధించింది ఇండియా. అయితే ఇక మూడో వన్డే లో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ శుభారంభం ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే.


 ఇన్నింగ్స్లో రెండో ఓవర్ వేసిన మహమ్మద్ సిరాజ్ మూడు బంతుల్లో 2 వికెట్లు పడగొట్టి  వెస్టిండీస్ జట్టును దెబ్బతీశాడు. తొలి బంతికే ఓపెనర్ కెల్ మైర్స్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో విండీస్ మహిళా ఫ్యాన్ ఒక్కసారిగా షాక్ అయింది. తలకు చేతులు పెట్టుకుని నోరు తెరిచింది. ఇక రెండో బంతికి డాట్ బాల్ కాగా మూడో బంతికి షేమర్ బ్రూక్స్ ని ఎల్బిడబ్ల్యు రూపంలో పెవిలియన్  పంపించాడు.  ఇలా వరుసగా వికెట్లు తీయడం పై వెస్టిండీస్ అభిమానులు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోపై మీరు కూడా ఒక లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: