అయితే బుమ్రా ఇటీవలే తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతూ జట్టుకు దూరమయ్యాడు. అయితే అతని వెన్నునొప్పి మరింత వేధిస్తున్నట్లు తెలుస్తుంది.. అయితే 2019లో కూడా బుమ్రా ఇదే రీతిలో వెన్నునొప్పితో బాధపడ్డాడు అన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా ఎన్నో మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఇక ఇప్పుడు అతని గాయం మళ్లీ తిరగబెట్టింది అనేది తెలుస్తుంది. ప్రస్తుతం బెంగళూరులో నేషనల్ క్రికెట్ అకాడమీ లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే టి20 ప్రపంచకప్కు జట్టును ప్రకటించేందుకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రస్తుతం జట్టులో కీలక బౌలర్ గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా గాయం బిసిసిఐ ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ క్రమంలోనే జస్ప్రీత్ బుమ్రా గాయం మా జట్టును కలవరపెడుతోంది. ప్రస్తుతం అతను నేషనల్ క్రికెట్ అకాడమీ లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అతడి పాత గాయం మళ్లీ తిరగబెట్టింది. ప్రస్తుతం బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. అయితే ప్రపంచ కప్కు కేవలం కొన్ని రోజులు ఉన్న సమయం ఉంది. ఇప్పుడు బుమ్రా గాయపడటం దురదృష్టం అని చెప్పాలి . అతను జట్టు ప్రధాన బౌలర్గా కాబట్టి గాయం నుంచి తొందరగా కోలుకొని జట్టులో చేరుతాడని ఆశిస్తున్నాం అంటూ బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక అభిమానులు కూడా బుమ్రా గాయంపై ఆందోళన చెందుతున్నారు.