వన్డే ఫార్మాట్ అంతర్జాతీయస్థాయిలో రోహిత్ ఇప్పటివరకు మూడు ద్విశతకాలు సాధించాడు. 2013లో ఆస్ట్రేలియా పై ద్విశతకం సాధించడం ద్వారా తన పరంపర కొనసాగించాడు. 2007లో శ్రీలంకపై 2012లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై ద్విశతకాలు సాధించాడు. అయితే ఇంతవరకు కూడా విరాట్ కోహ్లీ వన్డేల్లో డబుల్ సెంచరీ అందుకోలేకపోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఏకంగా తన జట్టు ముంబై ఇండియన్స్ కి ఐదుసార్లు టైటిల్ అందించాడు. ఈ క్రమంలోనే అత్యధిక టైటిల్స్ అందించిన సారథిగా తన పేరును చిరస్మరణీయం చేసుకున్నాడు.
కానీ విరాట్ కోహ్లీ మాత్రం బెంగళూరు జట్టుకు ఒక్కసారి కూడా టైటిల్ అందించలేకపోయాడు. ఇక ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ సీజన్ తో కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక అంతర్జాతీయ వన్డేలో రోహిత్ శర్మ ఇప్పటివరకు 250కి పైగా సిక్సర్లు బాదాడు. అయితే విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ లో 43 సెంచరీలతో సత్తాచాటినప్పటికీ సిక్సర్ల విషయంలో మాత్రం వెనకబడ్డాడు. ఇప్పటివరకు 125 సిక్సర్లు మాత్రమే బాదాడు. ఇలా విరాట్ కోహ్లీ రికార్డుల రారాజు అయినప్పటికీ తన సహచరుడు అయినా రోహిత్ శర్మ సాధించిన రికార్డులకు మాత్రం ఇప్పటికీ చేరువ కాలేకపోయాడు అని చెప్పాలి.