మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే  అన్ని జట్లు కూడా తమదైన ప్రణాళికలతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే అటు టీమిండియా టి20 వరల్డ్ కప్ కి ముందు కీలకమైన టి20 సిరీస్ లను ఆడతోంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా తో టి20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్ లో భాగంగా 2-1 తేడాతో విజయం సాధించిన టీమిండియా సిరీస్ కైవసం చేసుకుని ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.


 ఈ క్రమంలోనే కాస్త గ్యాప్ లోనే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా తో టి20 సిరీస్ కి సిద్ధమైంది టీం ఇండియా. ఇక నైట్ నుంచి భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య మూడు మ్యాచ్ల టి20 సిరీస్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక సౌత్ ఆఫ్రికా తో టి20 సిరీస్ లో కూడా భారత జట్టు అదే జోరుని కొనసాగిస్తుంది అని అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఇక నేడు సౌత్ ఆఫ్రికా తో టి20 సిరీస్ లో  భాగంగా మొదటి మ్యాచ్ తిరువనంతపురంలోని గ్రీన్ షీల్డ్ స్టేడియం లో జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే తమ అభిమాన క్రికెటర్లను వీక్షించేందుకు అటు ఫ్యాన్స్ అందరూ కూడా స్టేడియం లోకి వెళ్లేందుకు ఇప్పటికే టికెట్లను కొనుగోలు చేశారు. ఇకపోతే ఇప్పటికే ఆస్ట్రేలియా లాంటి మేటి జట్టు పై సిరీస్ గెలిచి జోరు మీద ఉన్న టీం ఇండియా అటు సౌత్ ఆఫ్రికా ని క్లీన్ స్వీప్ చేస్తుంది అని అభిమానులు భావిస్తున్నారు.. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతూ ఉండడం గమనార్హం. అంతేకాదు భారత క్రికెటర్లకు సంబంధించి భారీ కటౌట్లు కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. కాగా నేడు తిరువనంతపురం వేదికగా జరగబోతున్న మొదటి టి20 మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారని మీరు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: