సాధారణంగా క్రికెటర్ బర్త్ డే అంటే సోషల్ మీడియాలో ఉండే హడావిడి అంతా ఇంత కాదు అన్న విషయం తెలిసిందే. అభిమానులు, మాజీ ఆటగాళ్లు, సహచర ఆటగాళ్లు  ఇలా అందరూ కలిసి ఏకంగా క్రికెటర్లను సోషల్ మీడియా వేదికగా విష్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటిది ఒకే జట్టులో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ముగ్గురు క్రికెటర్లకు సంబంధించిన పుట్టినరోజు జరిగితే  ఇక అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటిదే జరిగింది. ఏకంగా టీమ్ ఇండియా జట్టులో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న జస్ ప్రీత్ బుమ్రా.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇక ఈ ముగ్గురు స్టార్ క్రికెటర్లకు సంబంధించిన పుట్టినరోజు పోస్టులే కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇలా ముగ్గురు స్టార్ క్రికెటర్లు ఒకేరోజు పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా యాదృచ్ఛికం  అని ఎంతోమంది అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం టీమిండియాలో క్రికెటర్లుగా కొనసాగుతున్న ఈ ముగ్గురు మాత్రమే కాదు మరో ముగ్గురు క్రికెటర్లు కూడా నేడే పుట్టినరోజు జరుపుకుంటున్నారు అన్న విషయం చాలామందికి తెలియదు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం..


 టీమిండియా మాజీ ఆటగాడు ఆర్పి సింగ్ సైతం నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 1985లో రాయి బరేలిలో జన్మించాడు ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫెసర్. 2018 లో అన్ని ఫార్మాట్లకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.

 టీమిండియా మాజీ క్రికెటర్ కరుణ్ నాయర్ సైతం నేడే పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 1991లో జన్మించి ఇక ఎక్కువ కాలం దేశవాళి క్రికెట్ లో తక్కువ కాలం టీమిండియా  తరపున ప్రాతినిధ్యం వహించాడు.


 ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ప్రింటాఫ్ సైతం నేడే పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 1977లో ఇదే రోజున ప్రింటాఫ్ జన్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: