అలాంటి రషీద్ ఖాన్ బౌలింగ్లో బ్యాట్స్మెన్లు సిక్సర్లు ఫోర్లు కొట్టడం చాలా అరుదుగా మాత్రమే చూస్తూ ఉంటాం. అయితే ఇక ఇటీవల ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా టి20 లీగ్ లో భాగంగా అటు అన్ని మ్యాచ్లు కూడా ఉత్కంఠ భరితంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ కు రషీద్ ఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టోర్నీలో రషీద్ ఖాన్ ఎందుకో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు అని చెప్పాలి.
ఇక ఎప్పుడూ తన బౌలింగ్లో పరుగులు కట్టడి చేసి వికెట్లు పడగొట్టే రషీద్ ఖాన్ ఇటీవల భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇటీవల సన్రైజర్స్ ఈస్టర్ తో జరిగిన మ్యాచ్లో రషీద్ ఖాన్ పేలవ బౌలింగ్ ప్రదర్శన చేశాడు నాలుగు ఓవర్ల కోటాలో ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టి 53 పరుగులు ఇచ్చాడు. ముఖ్యంగా రషీద్ ఖాన్ బౌలింగ్ లో సన్రైజర్స్ బ్యాటర్ మార్గో జాన్సన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతను వేసిన 16వ ఓవర్లో మార్కో జాన్సన్ 28 పరుగులు రాబట్టాడు. ఇందులో నాలుగు సిక్సర్లు ఒక ఫోర్ ఉండడం గమనార్హం. ఇక ఈ ఒక్క ఓవర్ తోనే సన్రైజర్స్ వైపు మ్యాచ్ మలుపు తిరిగింది అని చెప్పాలి.