ఎంఎస్ ధోని ఎంత గొప్ప క్రికెటర్ అనేది ప్రపంచానికి తెలుసు. ఒక్క మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ఎంఎస్ ధోనికి లెక్కపెట్టలేనంత మంది అభిమానులు ఉన్నారు. మన దేశానికి ఇప్పట్లో ప్రపంచ కప్ రాదు అనుకున్న సమయంలో లాస్ట్ లో సిక్సులు కొట్టి భారత్ కి రెండొవసారి ప్రపంచ తీసుకొచ్చిన క్రికెటర్ ఎంఎస్ ధోని. 


అలాంటి ఎంఎస్ ధోని రిటైర్ అవ్వాలని కోరుకుంటున్నారు కొంతమంది క్రికెట్ అభిమానులు. కారణం ప్రపంచ కప్ 2019 సెమిస్ వరుకు చేరుకున్న టీమిండియా ధోని నెమ్మదిగా ఆడటం వలనే ఓడిపోయిందని కామెంట్లు చేశారు నెటిజన్లు. ధోని త్వరగా రిటైర్ అవుతే మంచిదని వ్యాఖ్యలు కూడా చేశారు. కాగా ధోని రిటైర్మెంట్ పై వార్తలు కూడా భారీగా వస్తున్నాయి. 


ధోని మాత్రం రిటైర్మెంట్ గురించి స్పందించడం లేదు. అయితే ధోని స్పందించక పోయినప్పటికీ అతని తల్లిదండ్రులు మాత్రం స్పందించారు. తల్లిదండ్రులు స్పందిస్తూ 'ధోని ఎంత త్వరగా రిటైర్ అవుతే అంత మంచిది, తాను రిటైర్ అయ్యి తమతో పాటు ఇంట్లో ఉండి కుటుంబానికి దగ్గరగా ఉంటె చాలు అని వ్యాఖ్యానించారు. మరి ధోని రిటైర్ అవుతారా ? లేక కొనసాగుతారా అనేదానికి ధోనీయే  స్పందించాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: