తాజా ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో సెమీస్లో న్యూజిలాండ్పై భారత్ ఓటమి తర్వాత భారత్ జట్టులో తీవ్రమైన విబేధాలు వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ వర్సెస్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ గ్రూపులు ఉన్నాయన్నదే ఈ వార్తల సారాంశం. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా ట్వీట్టర్లో కాంట్రవర్సీ పోస్టులు పెడుతోన్న న్యూజిలాండ్ క్రికెటర్ జేమ్స్ నీషమ్ తాజాగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని టార్గెట్గా చేసుకుని ఓ కాంట్రవర్సీ పోస్టు పెట్టాడు. దీంతో ఇప్పుడు నెటిజన్లు నీషమ్ను టార్గెట్గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ రెండో రోజు ఆటలో 125 పరుగులు చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి బర్న్స్ 125 పరుగులతో అజేయంగా క్రీజ్లో ఉన్నాడు. ఈ విషయాన్ని ప్రస్తావించిన నీషమ్ ఈ ప్రతిష్టాత్మక సిరీస్లో కోహ్లి కంటే బర్న్స్ ఎక్కువ పరుగులు చేశాడంటూ తన ట్వీటర్ అకౌంట్లో జోక్ చేశాడు. తొలి యాషెస్ ఇన్నింగ్స్లో కోహ్లి కంటే బర్న్స్ ఎక్కువ పరుగులు చేశాడన్నదే నీషమ్ ఉద్దేశం కావచ్చు.
నీషమ్ కోహ్లిపై వేసిన సెటైర్ కోహ్లి అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో నీషమ్ను ఏకిపారేస్తున్నారు. ప్రపంచకప్లో భారత్ ఫైనల్కు చేరకుండానే ఓడింది. అప్పుడు నీషమ్ ఆ మ్యాచ్కు ముందుగానే టిక్కెట్లు కొన్న ఇండియన్లు తమకు టిక్కెట్లు ఇవ్వాలని ట్వీట్ చేశాడు. ఇక ఇప్పుడు కోహ్లికి బర్న్స్కు పోలిక పెట్టాడు. వీటిపై నెటిజన్లు అతడికి వార్నింగ్ ఇస్తూ పలు పోస్టులు పెడుతున్నారు.
టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ యాషెస్ సిరీస్లో వికెట్లు ఏమీ తీయలేకపోయాడే అంటూ సెటైర్ వేశాడు. మరో అభిమాని మొత్తం న్యూజిలాండ్ టాపార్డర్ ఆటగాళ్లు పరుగులు కంటే కోహ్లి ఒక్కడే ఎక్కువ పరుగులు చేశాడనే విషయం తెలుసుకో నీషమ్ అంటూ చురకలు అంటించాడు. మరో అభిమాని ఆసియాకప్లో ఆసీస్-ఇంగ్లండ్ ఆటగాళ్ల కంటే కోహ్లనే ఎక్కువ పరుగులు చేశాడని మరొకరు పంచ్ పేల్చారు. అసలు మ్యాటర్ ఏంటంటే యాషెన్ అనేది ఆస్ట్రేలియా - ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగేది అన్న విషయం నీషన్కు తెలియదా ? లేదా ? ఈ కామెంట్ ఎందుకు చేశాడన్నది ఎవ్వరికి తెలియడం లేదు.