ఆంటిగ్వాలో విండీస్ 'ఎ' జట్టుతో మూడు రోజుల టూర్ మ్యాచ్ ప్రారంభ రోజున పుజారా, రోహిత్ మంచి పరుగులు తీసారు. ఫామ్ లో ఉన్న చేతేశ్వర్ పుజారా సెంచరీ కొట్టగా, డిప్యూటీ కెప్టెన్ రోహిత్ శర్మ  అర్ధ సెంచరీ కొట్టా. రోజు ముగిసేనాటికి  భారతీయులు 297/5 స్కోరు చేశారు. శనివారం ఆగస్టు 17, భారతీయులు, విండీస్ ఎ ఈ మూడు రోజుల వార్మప్ ఆటను ప్రారంభించారు. గాయపడి  కెప్టెన్ విరాట్ కోహ్లీ లేనందువల్ల అజింక్య రహానె భారత జట్టుకి నాయకత్వం వహిస్తున్నాడు.


టాస్ గెలిచిన తరువాత, భారత మొదట బ్యాటింగ్ చేస్తుందని తెలిపాడు  కెప్టెన్ రహానె. అయితే, ఆ ప్రారంభ రోజున చాలా మంది భారత బ్యాట్స్ మెన్ ఎక్కువ స్కోర్లు చేయలేకపోయారు. కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ భాగస్వాములుగా ఇండియన్స్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మొదటి వికెట్‌కు 36 పరుగుల భాగస్వామ్యం తరువాత, అగర్వాల్ (12 పరుగులు)  పేసర్ జోనాథన్ కార్టర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మూడు ఓవర్ల తరువాత, కియోన్ హార్డింగ్ ఇంకొక ఓపెనర్ కెఎల్ రాహుల్‌ను 36 పరుగులకు అవుట్ చేశాడు.  కార్టర్ 53/3 పరుగులతో భారతీయులు కష్టపడుతుండగా స్టాండ్-ఇన్ కెప్టెన్ అజింక్య రహానె ను కేవలం ఒక పరుగుకు  మాత్రమే వికెట్ తీసుకున్నాడు. 


మధ్యహ్న విరామ సమయానికి భారతీయులు 89/3 పరుగులు చేశారు. చేతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ ఆ సమయంలో  తమ భాగస్వామ్యాన్ని  నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు.  చేతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మలకు  రోజు ముగిసే సమయానికి 132 పరుగుల భాగస్వామ్యం ఉంది. రెండో సెషన్‌లో పూజారా, రోహిత్ తమ భాగస్వామ్యం లో‌ ఎక్కువ సేపు ఆడారు.  ఆఫ్‌ స్పిన్నర్‌ అకీమ్‌ ఫ్రేజర్‌ చేతిలో అవుటయ్యేప్పటికి బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ 115 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో రోహిత్ ఎనిమిది ఫోర్లు,ఒక సిక్స్ మాత్రమే కొట్టాడు.


మరోవైపు, పుజారా తన అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత చాలా సేపు తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. టీ బ్రేక్ సమయానికి భారతీయులు 219/4 స్కోర్ సాధించారు. మూడవ సెషన్‌లో పుజారా తన సెంచరీ పూర్తి చేసి, ఆ తర్వాత నాటౌట్‌గా రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడు.  187 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, కేవలం ఒక సిక్స్ మాత్రమే  కొట్టి 100 పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: