ఆదివారం నుండి  సౌత్ ఆఫ్రికా భారత్ జట్ల మధ్య టీ 20,సిరీస్ ప్రారంభం కానుంది. ఈసిరీస్ లో సొంత గడ్డ ఫై టీం ఇండియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది.  ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ లో  భీకర ఫామ్ లో వున్నా టీం ఇండియా  స్టార్ ఓపెనర్  రోహిత్ శర్మ  ముందు  ఓ అరుదైన రికార్డు వుంది.  అదేంటంటే రోహిత్ మరో 85 పరుగులు చేస్తే చాలు సౌత్ ఆఫ్రికా ఫై టీ 20ల్లో అత్యధిక  పరుగులు చేసిన ఆటగాడిగా  రికార్డు సృష్టించనున్నాడు. ప్రస్తుతం ఈ జాబితాలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్  424పరుగులతో  మొదటి స్థానం లో వున్నాడు. కాగా రోహిత్  ఇప్పటివరకు టీ 20ల్లో సౌత్ఆఫ్రికా ఫై 340పరుగులు చేశాడు.  తాజాగా జరుగునున్న సిరీస్ లో మూడు మ్యాచ్ లు వున్నాయి కాబట్టి రోహిత్కు  ఆ 85 పరుగులు చేయడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. 




ఇదిలా ఉంటే  ఇప్పటివరకు స్వదేశంలో భారత్ , సౌత్ అఫ్రికా ఫై పొట్టి ఫార్మాట్ లో సిరీస్ ను గెలవకపోవడం  గమనార్హం.  దాంతో ఈసారి ఎలాగైనా సిరీస్ ను కైవసం చేసుకోవాలని టీం ఇండియా పట్టు దలగా వుంది.  ఈరెండు జట్ల మధ్య  ధర్మశాల వేదిక గా మొదటి టీ 20 మ్యాచ్ జరగనుంది.  ఆదివారం 7గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ , హాట్ స్టార్ మరియు జియో టీవీ లో  ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: