ఢిల్లీ హైకోర్టులో 5జీ టెక్నాలజీ విషయమై వేసిన కేసులో బాలీవుడ్ నటి జుహీ చావ్లాకు దిమ్మతిరిగే షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఓఏఐ ఈ ప్రకటన జారీ చేయడం జరిగింది. టెలికాం టవర్ల నుంచి విలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కు సంబంధించి ప్రపంచంలో ఆమోదం పొందిన ప్రమాణాల కంటే మన దేశంలో విధించిన నియమ నిబంధనలు చాలా కఠినమైనవని తెలపడం జరిగింది."ఇండియాలో అనుమతించిన రేడియేషన్ ప్రపంచవ్యాప్తంగా అంగీకరించిన వాటిలో పదోవంతు అయినందువల్ల రేడియేషన్ వల్ల ప్రతికూల ప్రభావం పడుతుందన్న భయాలు ఇప్పుడు అనవసరం.
ఈ సరిక్రొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పుడల్లా ఇలా జరుగుతుంది" అని సీఓఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ పీటీఐకి చెప్పడం జరిగింది. దేశంలో 5జీ వైర్లెస్ నెట్వర్క్లను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జూహి చావ్లా ఢిల్లీ హైకోర్టులో దావా వేసిన విషయం తెలిసిందే. ఆ విచారణ సమయంలో హైకోర్టు జూహి చావ్లాపై, ఇతర పిటిషనర్లపై రూ.20 లక్షల జరిమానా విధించడం జరిగింది. ఈ వ్యాజ్యం లోపం అనేది భూయిష్టమైనదని, న్యాయప్రక్రియ దుర్వినియోగమైందని, కేవలం ప్రచారం పొందేందుకే ఈ కేసు పెట్టినట్టుగా ఉందని ఢిల్లీ హై కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది.