సాఫ్ట్ వేర్  ఉద్యోగులకు వచ్చే జనవరి నుంచి కార్యాలయాల నుండి పని చేయాలన్నా కంపెనీల ప్రయత్నాలకు ఓమిక్రాన్ బ్రేకులు వేసే పరిస్థితి కనిపిస్తున్నాయి. కరోణ కారణంగా ఈ ఉద్యోగాలు రెండేళ్లుగా వర్క్ ఫ్రం హోం విధానంలో ఇంటి నుంచే పనిచేస్తున్నారు. వ్యాక్సినేషన్ ఊపందుకున్న ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడటంతో వచ్చే ఏడాది జనవరి చివరి వారం వరకు అన్ని ఐటి కంపెనీలు తమ ఉద్యోగులకు ఫుల్ టైం వర్క్ ఆఫీస్ ఇచ్చేలా ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సందర్భంలోనే ఒక్కసారిగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన  ఓమిక్రాన్ వైరస్ వేరియంట్  ప్రభావం ఐటీ ఉద్యోగుల వర్క్ ఫ్రం ఆఫీస్ విధానం పునరుద్దరణనపై పడింది. హైదరాబాదులో సుమారు 1200 మంది సాఫ్ట్వేర్ సంస్థలు ఉండగా వీటిలో ఆరు లక్షల మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది కరోణ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్  వెళ్ళిపోయారు.

 ఇటీవల వ్యాక్సినేషన్ జోరు అందుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా వారికి భరోసా ఇచ్చింది. ఆఫీస్ లో నుంచి పనిచేయాలని ప్రోత్సహించింది. దీంతో ఇప్పుడిప్పుడే కంపెనీలు తమ ఉద్యోగుల వర్క్ ఫ్రం  ఆఫీస్ కి సిద్ధం చేశారు. ఈ తరుణంలో  సరిగ్గా దక్షిణాఫ్రికా లో కరోనా కలకలం రేపడంతో కేసులు వేగంగా పెరగడంతో ఉద్యోగులంతా భయాందోళనకు గురై పరిస్థితులు కూడా వచ్చాయి. దక్షిణాఫ్రికాలో ప్రారంభమైన ఓమిక్రాన్ తక్కువ వ్యవధిలో ఇతర దేశాలకు పాకింది. ఐటీ కంపెనీలు కరోనా రావడానికి ముందు లాగా  పనిచేయడం లేదని, ఐటీ కంపెనీల కాకుండా ఐటీ ఉద్యోగులు, వారి ఇంట్లోనుంచి బయటకి వస్తే హైదరాబాద్ నగరంలో పరోక్షంగా వాటిపై ఆధారపడ్డ ఎంతో మంది ఉపాధి పొందుతున్నారని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఏది ఏమైనా కరోణ మళ్ళీ విజృంభించడంతో తెలంగాణలో మళ్లీ పాత పరిస్థితులు వస్తాయని అనుకుంటున్నారు. దీంతో ఐటి ఉద్యోగులంతా ఇంటి నుంచే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: