మోసం ఎలా చేస్తున్నారంటే..!
సైబర్ నేరగాళ్లు మోసం ఎలా చేస్తున్నారో ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చరులో ఒకరైనా రాజశేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఒక యూజర్ పోర్న్ చూస్తూ ఉండగా బ్రౌజర్ అనేది బ్లాక్ అవుతుంది. ఆ బ్రౌజర్ను మళ్లీ అన్ బ్లాక్ చేయాలంటే డబ్బులు చెల్లించాలని ఒక మెసేజ్ వస్తుంది. తర్వాత బ్రౌజర్ ఆగిపోతుంది. ఈ మెసేజ్ మినిస్ట్రీ ఆఫ్లా అండ్ జస్టిస్ నుండి వచ్చినట్టు నమ్మిస్తారు. భారత చట్టం ప్రకారం నిషేధించబడినటువంటి వాటిని వీక్షించడం చట్టవిరుద్ధమైన మెసేజ్ ఉంటుంది. దీని వల్ల మీ కంప్యూటర్ లాక్ అయిపోయిందని, దీన్ని అన్ లాక్ చేయాలంటే 29 వేల రూపాయలు చెల్లించాలని ఉంటుంది. ఈ అమౌంట్ ను కొన్ని గంటల్లో చెల్లించకపోతే మిమ్మల్ని నేరవిచారణ కింద పోలీస్ శాఖకు తరలిస్తారని మెసేజ్ లో ఉంటుంది.